
IND vs WI Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్ట్ను ఘనంగా గెలిచిన శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు, ఈ మ్యాచ్లోనూ అదే ఉత్సాహం,దృఢ సంకల్పంతో ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఇక రెండో టెస్ట్ టాస్లో అదృష్టం టీమిండియాకే దక్కింది. కెప్టెన్ గిల్, మొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇక టాస్ గెలిచిన గిల్ మాట్లాడుతూ,"వికెట్ చాలా బాగుంది.ఎక్కువ రన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మంచి ప్రదర్శన కొనసాగించాలి.కెప్టెన్సీతో బాధ్యతలు పెరిగాయి కానీ దానిని నేను ఆస్వాదిస్తున్నాను" అని తెలిపారు.
వివరాలు
కనీసం 90 ఓవర్లు బ్యాటింగ్ చేయడం మా లక్ష్యం
ఇక మొదటి టెస్టు టీంలో ఆడిన జట్టే ఆడుతుందని, ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు. వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేస్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. ఈ పిచ్ పొడిగా ఉంది. మా బ్యాటింగ్పై సమావేశాల్లో చర్చించాం. కనీసం 90 ఓవర్లు బ్యాటింగ్ చేయడం మా లక్ష్యం. ప్రతి బంతిని విలువతో ఆడతాం" అని తెలిపారు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ.. బ్రాండన్ కింగ్, అల్జారీ జోసెఫ్ స్థానంలో టెవిన్ ఇమ్లాచ్ మరియు ఆండర్సన్ ఫిలిప్ జట్టులో చేరనున్నారు.
వివరాలు
ప్లేయింగ్ XI
ఇక నేటి ఇరు జట్లు ప్లేయింగ్ XI ఇలా ఉన్నాయి.. భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. వెస్టిండీస్: టాగెనరైన్ చాందర్పాల్, జాన్ క్యాంప్బెల్, అలిక్ ఆథనేజ్, షై హోప్, టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), రోస్టన్ చేస్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.