NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత
    తదుపరి వార్తా కథనం
    Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత
    చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత

    Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 22, 2024
    09:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చెస్‌ జట్లు ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో మొదటిసారి పసిడి పతకాన్ని గెలచుకొని చరిత్రను సృష్టించింది.

    ఓపెన్ సెక్షన్ లో భారత్ మరో రౌండ్ మిగిలుండగానే 19 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

    కీలకమైన పదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు, బలమైన అమెరికాను 2.5-1.5 తేడాతో ఓడించి, 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

    పతకం దాదాపు ఖాయం చేసుకున్న ఈ జట్టు, 11వ రౌండ్ మిగిలి ఉండగానే రెండో స్థానంలో ఉన్న చైనా కంటే 2 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.

    Details

    పసిడి కోసం మహిళా జట్టు పోరాటం

    పదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు సత్తా చాటింది.

    టాప్ సీడ్‌ అమెరికాతో జరిగిన పోరులో, నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో వెస్లీ చేతిలో ఓడినా, గుకేశ్‌ తెల్లపావులతో 46 ఎత్తుల్లో కరువానాపై విజయం సాధించాడు.

    విదిత్‌ అరోనియన్‌తో గేమ్‌ను డ్రాగా ముగించగా, అర్జున్‌ ఇరిగేశి 60 ఎత్తుల్లో పెరెజ్‌ లీనియర్‌ను ఓడించి భారత్‌కు కీలక విజయం అందించాడు.

    మహిళల జట్టు కూడా పసిడి పతకం కోసం గట్టిగా పోరాడుతోంది. పదో రౌండ్‌లో చైనాను 2.5-1.5తో ఓడించి అగ్రస్థానంలో నిలిచింది.

    దివ్య దేశ్‌ముఖ్‌ తెల్లపావులతో చైనాకు చెందిన షికున్‌పై విజయం సాధించింది.

    Details

    ఇప్పటివరకూ నాలుగు బంగారు పతకాలు కైవసం

    హారిక, వంతిక అగర్వాల్, వైశాలి మూడు గేమ్‌లను డ్రాగా ముగించి జట్టుకు ప్రధాన పాయింట్లు అందించారు.

    10 రౌండ్ల తర్వాత భారత మహిళల జట్టు 17 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందంజలో ఉంది.

    ఇప్పటి వరకు చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్ నాలుగు పతకాలు గెలుచుకుంది. 2014, 2022లో కాంస్య పతకాలను సాధించింది.

    2020లో వర్చువల్‌గా జరిగిన టోర్నమెంట్‌లో రష్యాతో కలసి స్వర్ణ పతకం గెలుచుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చెస్
    ఇండియా

    తాజా

    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ

    చెస్

    Chess world cup 2023: ప్రపంచకప్ చెస్ ఫైనల్‌కు చేరుకున్న ప్రజ్ఞానంద: కార్లసన్‌తో నేడు ఢీ   చెస్ ప్రపంచ కప్
    Chess World Cup : ప్చ్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి చెస్ ప్రపంచ కప్
    ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలగిన భారత జట్టు  క్రీడలు
    Praggnanandhaa: ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథ్ ఆనంద్ ను దాటి..  క్రీడలు

    ఇండియా

    Darshan : కన్నడ నటుడు దర్శన్‌పై 3991 పేజీల చార్జీషీట్ దాఖలు బెంగళూరు
    Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు తమిళనాడు
    Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు బెంగళూరు
    Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025