NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు
    భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు
    క్రీడలు

    భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    February 13, 2023 | 11:46 am 1 నిమి చదవండి
    భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు
    ధర్మశాలలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు ఆదిరిపోయే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో రెండో టెస్టు ఆడనుంది. కాగా ధర్మశాల వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ధర్మశాలలో ఇటీవలే పిచ్, ఔట్ ఫీల్డ్‌ను మార్చారు. ఆ తర్వాత అక్కడ ఇక్కడ ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో బీసీసీఐ వేదికను మార్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు మ్యాచ్‌ను ధర్మశాల నుంచి ఇండోర్‌కు మార్చారు. పర్వత ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నందున హోల్కర్ స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

    ఇండోర్ లో మూడో టెస్ట్ మ్యాచ్

    హిమాచల్‌ప్రదేశ్‌లో ధర్మశాల క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోని అత్యంత అందమైన క్రికెట్ గ్రౌండ్స్‌లో ఒకటి. ధర్మశాల స్టేడియం నుంచి హిమాలయాలు కనిపిస్తూ, ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ జరిగింది. ఇండోర్‌కు మార్చడంపై ప్రస్తుతం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ధర్మశాలలో పిచ్ ఆస్ట్రేలియాకి బాగా కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే వేదికని ఇండోర్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిమానులు ఆరోపణలు చేయడం గమనార్హం. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 09న అహ్మదాబాద్‌లో జరగనుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    క్రికెట్

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    విజృంభించిన స్పిన్నర్లు, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం క్రికెట్
    రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్ క్రికెట్
    ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..! క్రికెట్
    మొదటి టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషాగ్నే క్రికెట్

    క్రికెట్

    కోహ్లీ కెప్టెన్సీలో చాలా నేర్చుకున్నా : రోహిత్‌శర్మ రోహిత్ శర్మ
    Womens T20 World Cup 2023లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం ఉమెన్ టీ20 సిరీస్
    ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్
    కేఎల్ రాహుల్ ఇంకా నువ్వు మారవా, నీకంటే గిల్ బెటర్ కెఎల్ రాహుల్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023