NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
    ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    09:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత దివ్యాంగ క్రికెట్‌ జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది.

    శ్రీలంకలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను 79 పరుగుల తేడాతో ఓడించింది.

    ఫైనల్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టంతో 197 పరుగుల భారీ స్కోర్‌ను చేసింది.

    ఇంగ్లండ్‌ ఛేదనలో 118 పరుగులకే ఆలౌట్‌ అవ్వడంతో భారత్‌ విజయం సాధించింది.

    వివరాలు 

    యోగేంద్ర భదోరియా విధ్వంసం 

    ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసాన్ని సృష్టించాడు.

    అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు.

    భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు.రాధికా ప్రసాద్‌ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనబరచాడు.

    కెప్టెన్‌ విక్రాంత్‌ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

    వివరాలు 

    కోచ్ రోహిత్ జలానీ అభినందనలు 

    చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు విజయాన్ని ప్రధాన కోచ్ రోహిత్ జలానీ మెచ్చుకున్నాడు.

    జట్టు అసాధారణ ప్రదర్శన, సన్నద్ధతను ప్రశంసిస్తూ, టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతీ సవాలును అధిగమించారని చెప్పారు.

    DCCI ప్రకటన

    భారత దివ్యాంగ క్రికెట్‌ కౌన్సిల్‌ (DCCI) ఛాంపియన్స్‌ ట్రోఫీ విజయం గురించి అధికారికంగా ప్రకటించింది.

    కృషి, దృఢ సంకల్పం, నైపుణ్యంతో అద్భుత ప్రదర్శన కనబరిచిన జట్టుకు అభినందనలు తెలిపింది.

    వివరాలు 

    విక్రాంత్‌ కేనీ వ్యాఖ్యలు 

    మెగా టోర్నీలో భారత జట్టును కెప్టెన్‌గా నడిపిన విక్రాంత్‌ కేనీ, ఈ విజయాన్ని తన కెరీర్‌లో గొప్ప గౌరవంగా అభివర్ణించాడు.

    జట్టులోని ప్రతీ ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయంలో భాగస్వామిగా నిలిచినట్లు పేర్కొన్నాడు.

    ఈ విజయాన్ని భారతదేశం తరపున క్రికెట్‌ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి అంకితం చేస్తున్నట్లు DCCI ఒక ప్రకటనలో తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛాంపియన్స్ ట్రోఫీ

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025