NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ind Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ ఓటమి.. సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ind Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ ఓటమి.. సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా 
    నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ ఓటమి.. సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా

    Ind Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ ఓటమి.. సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    10:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (టీమ్‌ఇండియా) 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

    మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

    పుణే వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

    182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది.

    హ్యారీ బ్రూక్‌ (51; 26 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో పోరాడినప్పటికీ, ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది.

    భారత్‌ బౌలర్లలో హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో వికెట్ తీశారు.

    వివరాలు 

    ఓపెనర్లు మెరిపించినా 

    అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో 181 పరుగులు చేసింది.

    లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు ప్రారంభంలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ (23), డకెట్‌ (39) వరుస బౌండరీలు బాదుతూ టీమ్‌ ఇండియాను ఇబ్బందుల్లో పడేసింది.

    ఈ జోడీని రవి బిష్ణోయ్‌ బ్రేక్‌ చేశాడు.జట్టు స్కోరు 62 వద్ద డకెట్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్యకుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

    తర్వత అక్షర్‌ పటేల్‌ సాల్ట్‌ను బౌల్డ్‌ చేశాడు. మొదటి డౌన్‌లో వచ్చిన బట్లర్‌ (2)ను వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్‌కు పంపించాడు.

    అంతేకాదు, క్రీజులోకి వచ్చిన ఓవర్టిన్‌ (19) తప్ప మిగతా క్రీడాకారులు సింగిల్‌ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

    వివరాలు 

    భారత్‌ టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా: 

    ఈ మ్యాచ్‌లో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ మరోసారి విఫలమైంది.ఓపెనర్లు సంజు శాంసన్‌ (1),అభిషేక్‌ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటయ్యారు.

    ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్‌ వర్మ (0)సూర్యకుమార్‌ యాదవ్‌ (0)డకౌట్‌గా వెనుదిరిగారు. మహమూద్‌ ఒక్క ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ను తీవ్రంగా దెబ్బతీశాడు.

    అయితే,మూడో డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్‌(30; 26 బంతుల్లో 4×4, 1×6) తాత్కాలికంగా మెరుపులు చూపించాడు.

    అయితే, జట్టు స్కోరు 79 వద్ద కార్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్‌ చేతికి చిక్కాడు.

    కానీ ఆల్‌ రౌండర్లు శివమ్‌ దూబె(53; 34 బంతుల్లో 7×4, 2×6),హార్దిక్‌ పాండ్య(53; 30 బంతుల్లో 4×4, 4×6) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడారు.

    అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టీమిండియా

    IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే ఆస్ట్రేలియా
    Jasprit Bumrah: గాయంతో పోరాడినా, ఫలితం నిరాశను మిగిల్చింది : బుమ్రా జస్పిత్ బుమ్రా
    Team India: ఆటగాళ్లకు కోచ్‌ సూచనల అవసరం.. గంభీర్‌ను ప్రశంసించిన యోగ్‌రాజ్‌ గౌతమ్ గంభీర్
    Champions Trophy 2025: భారత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్క్వాడ్ ప్రకటన ఎప్పుడంటే? ICC నిర్దేశించిన గడువు ఎంత? క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025