Page Loader
Ind Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ ఓటమి.. సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా 
నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ ఓటమి.. సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా

Ind Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ ఓటమి.. సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
10:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (టీమ్‌ఇండియా) 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. పుణే వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (51; 26 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో పోరాడినప్పటికీ, ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. భారత్‌ బౌలర్లలో హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో వికెట్ తీశారు.

వివరాలు 

ఓపెనర్లు మెరిపించినా 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు ప్రారంభంలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ (23), డకెట్‌ (39) వరుస బౌండరీలు బాదుతూ టీమ్‌ ఇండియాను ఇబ్బందుల్లో పడేసింది. ఈ జోడీని రవి బిష్ణోయ్‌ బ్రేక్‌ చేశాడు.జట్టు స్కోరు 62 వద్ద డకెట్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్యకుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వత అక్షర్‌ పటేల్‌ సాల్ట్‌ను బౌల్డ్‌ చేశాడు. మొదటి డౌన్‌లో వచ్చిన బట్లర్‌ (2)ను వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్‌కు పంపించాడు. అంతేకాదు, క్రీజులోకి వచ్చిన ఓవర్టిన్‌ (19) తప్ప మిగతా క్రీడాకారులు సింగిల్‌ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

వివరాలు 

భారత్‌ టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా: 

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ మరోసారి విఫలమైంది.ఓపెనర్లు సంజు శాంసన్‌ (1),అభిషేక్‌ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్‌ వర్మ (0)సూర్యకుమార్‌ యాదవ్‌ (0)డకౌట్‌గా వెనుదిరిగారు. మహమూద్‌ ఒక్క ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ను తీవ్రంగా దెబ్బతీశాడు. అయితే,మూడో డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్‌(30; 26 బంతుల్లో 4×4, 1×6) తాత్కాలికంగా మెరుపులు చూపించాడు. అయితే, జట్టు స్కోరు 79 వద్ద కార్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్‌ చేతికి చిక్కాడు. కానీ ఆల్‌ రౌండర్లు శివమ్‌ దూబె(53; 34 బంతుల్లో 7×4, 2×6),హార్దిక్‌ పాండ్య(53; 30 బంతుల్లో 4×4, 4×6) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడారు. అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు.