అన్ని ఫార్మాట్లకు అంబటి రాయుడు గుడ్ బై.. ఇక పోలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్!
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. చిన్న వయస్సులోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు ఐపీఎల్లో ఆరుసార్లు టైటిల్ అందుకున్న ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. ఇటీవలే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను తాజాగా భారత జాతీయ జట్టుతో పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రాయుడు తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం తనను మరో రూపంలో చూస్తారని పొలిటకల్ ఎంట్రీకి హింట్ ఇచ్చాడు. చిన్న వయస్సులో టెన్నిస్ బాల్ ని ఆడేందుకు బ్యాట్ పట్టుకున్న క్షణం నుంచి మూడు దశాబ్దాల తన ప్రయాణం ఇలా ఊహించలేదని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.
వైసీపీ తరుపున పోటీ చేయనున్న రాయుడు?
భారత జట్టుకి ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వకారణమని, 2013లో తొలిసారి టీమిండియా క్యాప్ అందుకున్న క్షణాలు ఇంకా గుర్తుకున్నాయని రాయుడు పేర్కొన్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లకి ప్రత్యేక కృతజ్ఞతలని, 2013లో ముంబై ఇండియన్స్ తరుపున మొదటి ట్రోఫీ నెగ్గినప్పటి నుండి సీఎస్కే తరుపున 2018, 2021, 2023 లలో టోఫ్రీలు నెగ్గడం మరిచిపోలేనిదని తెలిపారు. టీమిండియా తరుపున రాయుడు 55 వన్డేలు, ఆరు టీ20లు ఆడాడు. అదే విధంగా ఐపీఎల్ లో 204 మ్యాచులు ఆడి 4,348 పరుగులు చేశాడు. రాయుడు వైసీసీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.