Sunil Chhetri: రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడో తెలుసా..?
భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు దాదాపు తొమ్మిది నిమిషాల నిడివి కలిగిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సునీల్ ఛెత్రి మాట్లాడుతూ.. జూన్ 6న కువైట్తో తన చివరి మ్యాచ్ ఆడనున్నట్టు చెప్పాడు. భారత్ - కువైట్ మధ్య జూన్ 6న ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత్ గ్రూప్-ఎలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలోఉన్న ఖతార్ కంటే వెనుకబడి ఉంది.
స్పందించిన బీసీసీఐ
సునీల్ ఛెత్రి 20 ఏళ్ల కెరీర్లో భారత్ తరఫున 145 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. అతని కెరీర్ మొత్తంలో 93 గోల్స్ సాధించాడు. సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ రిటైర్మెంట్ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ట్వీట్ చేసింది. "మీ కెరీర్ అసాధారణమైనది కాదు, మీరు భారతీయ ఫుట్బాల్, భారతీయ క్రీడలకు అద్భుతమైన చిహ్నంగా ఉన్నారు" అని బోర్డు రాసింది.