NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆసియా ఛాంపియన్‌గా భారత కబడ్డీ జట్టు.. 8వసారి టైటిల్ కైవసం
    తదుపరి వార్తా కథనం
    ఆసియా ఛాంపియన్‌గా భారత కబడ్డీ జట్టు.. 8వసారి టైటిల్ కైవసం
    విజేతగా నిలిచిన భారత కబడ్డీ జట్టు

    ఆసియా ఛాంపియన్‌గా భారత కబడ్డీ జట్టు.. 8వసారి టైటిల్ కైవసం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 30, 2023
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కబడ్డీ ఆటలో తమకు తిరుగులేదని భారత పురుషుల జట్టు మరోసారి నిరూపించింది. నేడు జరిగిన ఆసియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఇరాన్‌పై ఘన విజయం సాధించింది.

    దక్షిణా కొరియాలోని బుసాన్ వేదికగా ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో పది పాయింట్ల తేడాతో ఇరాన్ ను చిత్తు చేసి భారత్ టైటిల్ ను సాధించింది.

    దీంతో 8వ సారి ఆసియన్ కబడ్డీ ఛాంపియన్ షిప్ టైటిల్ ను భారత్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది.

    ముఖ్యంగా ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ షెహ్రావత్ 10 పాయింట్లు సాధించి సత్తాచాటాడు. ఇప్పటివరకూ ఈ టోర్నీ తొమ్మిదిసార్లు జరగ్గా, ఎనిమిదిసార్లు టీమిండియానే ఛాంపియన్ గా నిలవడం విశేషం.

    Details

    ఆసియా గేమ్స్ పై దృష్టి సారించనున్న భారత కబడ్డీ జట్టు

    అంతకుముందు జరిగిన చివరి లీగ్ మ్యాచులో భారత్ 64-20తో హాంకాంగ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. దాంతో టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది.

    ఈ మెగా టోర్నీలో భారత్, ఇరాన్, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, హాంకాంగ్ జట్లు పోటీ పడ్డాయి. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

    ఇక భారత కబడ్డీ జట్టుకు తర్వాత ఆసియా గేమ్స్ కీలకంగా మారనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్ జపూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది.

    2018 ఆసియా క్రీడల్లో భారత్ సెమీఫైనల్లోనే ఓడిన విషయం తెలిసిందే. ఈ సారి స్వర్ణం గెలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్పోర్ట్స్
    ప్రపంచం

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    స్పోర్ట్స్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    ఆస్ట్రేలియా ఓపెన్స్‌లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఎలెనా రైబాకినా బ్యాట్మింటన్
    భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం ప్రపంచం
    క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్ ప్రపంచం

    ప్రపంచం

    తాలిబన్ల సర్కారుకు ఎదురు దెబ్బ.. డిప్యూటీ గవర్నర్‌ దుర్మరణం గవర్నర్
    నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్.. స్వియాటెక్‌తో తలపడనున్న కోకో గౌఫ్ టెన్నిస్
    ChatGPTని ఉపయోగిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్  ఆపిల్
    వాట్సప్‌లో సరికొత్తగా 'ఇమేజ్ క్రాప్' ఫీచర్..!  వాట్సాప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025