Page Loader
Asian Games 2023: కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టు
కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టు

Asian Games 2023: కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2023
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా గేమ్స్ 2023లో భారత దేశం అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. సెమీ ఫైనల్స్ లో హాంకాగ్‌ చేతిలో భారత మహిళలు ఓడారు. జోష్నా చినప్ప, వర్ధమాన స్టార్ అనాహత్ సింగ్, తన్వీ ఖన్నాతో కూడిన త్రయం హాంకాంగ్‌తో 1-2 తేడాతో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించారు. కేవలం 22 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో తన్వి ఖన్నా 6-11, 7-11, 3-11 వరుస గేమ్‌లలో సిన్ యుక్ చాన్ చేతిలో పరాజయం పాలైంది.

Details

పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానం

ఈ కాంస్యంతో భారత్ ఎనిమిది స్వర్ణాలతో సహా 31 పతకాలతో పతకాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ ఖాతాలో 11 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. 5వ రోజున భారత్ షూటింగ్‌లో బంగారు, వూషులో వెండి, అశ్వక్రీడ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాలు సాధించారు.