NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: ఐపీఎల్.. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: ఐపీఎల్.. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్.. 
    ఐపీఎల్.. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్..

    IPL 2025: ఐపీఎల్.. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 సీజన్‌లో కొన్ని కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు బంతిపై ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తొలగించింది.

    దీంతో ఇకపై ఆటగాళ్లు బంతిపై ఉమ్మిని ఉపయోగించినా ఎటువంటి జరిమానా ఉండదు. అదనంగా, మ్యాచ్‌లలో మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు కొత్త ప్రయోగాలు చేయాలని బీసీసీఐ సిద్ధమైంది.

    ఇందులో భాగంగా, రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతిని ఉపయోగించే నియమాన్ని ప్రవేశపెట్టింది.

    ఈ మార్పుల గురించి గురువారం (మార్చి 20) జరిగిన సమావేశంలో ఐపీఎల్‌కు చెందిన 10 ఫ్రాంఛైజీల కెప్టెన్లు, మేనేజర్లకు బీసీసీఐ వివరించింది.

    వివరాలు 

    కరోనా సమయంలో ఉమ్మి నిషేధం 

    మునుపటి రోజుల్లో బంతి మెరుపును తగ్గించిన తర్వాత స్వింగ్, రివర్స్ స్వింగ్‌ను పొందేందుకు ఆటగాళ్లు ఉమ్మిని ఉపయోగించేవారు.

    బౌలర్లు బాల్‌పై ఉమ్మిని రాసి రుద్ది, అదనపు కదలికలను తీసుకురావడం సాధారణమే.

    అయితే 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి పెరిగిన తర్వాత, ఐసీసీ ఈ ప్రయోగాన్ని నిషేధించింది.

    వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో మే 2020లో ఐసీసీ ఈ నిబంధనను కఠినంగా అమలు చేసింది.

    వివరాలు 

    షమీ అభ్యర్థన - మాజీ బౌలర్ల మద్దతు 

    ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న భారత పేసర్ మహ్మద్ షమీ, బౌలర్ల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, ఐసీసీకి ఉమ్మి నిషేధాన్ని ఎత్తివేయాలని అభ్యర్థించాడు.

    ఈ అభ్యర్థనకు మాజీ పేసర్లు ఫిలాండర్, సౌథీ లాంటి ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు.

    చివరకు, కెప్టెన్ల సమావేశంలో అన్ని ఫ్రాంఛైజీల నాయకులు ఏకాభిప్రాయంతో ఉండటంతో బీసీసీఐ ఉమ్మి నిషేధాన్ని ఎత్తివేసింది.

    వివరాలు 

    రెండో కొత్త బంతి - కొత్త రూల్ 

    ప్రస్తుతం ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌కు ఒక కొత్త బంతిని మాత్రమే ఉపయోగిస్తున్నారు.

    అయితే,రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కారణంగా బంతిపై గిరిపట్టు తగ్గిపోవడం,బౌలర్లకు ఇబ్బందిగా మారింది.

    ఫలితంగా,ఛేజింగ్ టీమ్‌కు పెద్ద ప్రయోజనం కలుగుతోంది.ఈ పరిస్థితిని సరిచేయడానికి బీసీసీఐ కొత్త మార్గదర్శకాన్ని తీసుకువచ్చింది.

    ఈ నియమం ప్రకారం, ఇకపై రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతిని ఉపయోగించే అవకాశాన్ని బీసీసీఐ ఇచ్చింది.

    అయితే దీనికి ఓ నిబంధన ఉంది - ఆటలో డ్యూ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని అంపైర్లు భావిస్తే, కెప్టెన్ అభ్యర్థన మేరకు 11వ ఓవర్ తర్వాత కొత్త బంతిని అందిస్తారు.

    అయితే మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌ల్లో మంచు ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, ఈ కొత్త బంతి వాడే అవకాశం తగ్గొచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు ఆపరేషన్‌ సిందూర్‌
    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ రక్షణ
    civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు విమానాశ్రయం

    ఐపీఎల్

    Year Ender 2024: 2025 మెగా వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన టాప్ 5 ఆటగాళ్ల జాబితా రిషబ్ పంత్
    IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ  బీసీసీఐ
    WPL 2025: మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కౌంట్‌డౌన్.. WPL 2025 షెడ్యూల్‌ విడుదల క్రీడలు
    IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక లక్నో సూపర్‌జెయింట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025