NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో
    మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో

    IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025లోని మ్యాచ్‌లు వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.

    తాజా సమాచారం మేరకు,ఈ మ్యాచ్‌లు మళ్లీ మే 17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

    ఈ క్రమంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు ఊరట కలిగించే కీలక ప్రకటనను దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు విడుదల చేసింది.

    మొదట, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లు మే 26వ తేదీ వరకు మాత్రమే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని స్పష్టంచేసింది.

    దీనికి కారణంగా జూన్‌లో ఆస్ట్రేలియాతో తాము ఆడాల్సిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచును పేర్కొంది.

    వివరాలు 

    జూన్ 3న దక్షిణాఫ్రికా జింబాబ్వే వార్మప్ మ్యాచ్

    దానికి తగిన సన్నాహకాలను జరిపేందుకు తాము ఐపీఎల్ కంటే ఆ మ్యాచ్‌కే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించింది.

    కానీ ఈ ప్రకటన అనంతరం దక్షిణాఫ్రికా బోర్డు తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని యూటర్న్ ఇచ్చింది.

    తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించిన కొత్త నిర్ణయంతో, సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2025 ముగిసే వరకు తమ తమ జట్లకు అందుబాటులోనే ఉండనున్నారు.

    డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమవ్వాల్సిన నేపథ్యంలో సౌతాఫ్రికా తమ సన్నాహక కార్యక్రమాలను కాస్త కుదించినట్లు వెల్లడించింది.

    షెడ్యూల్‌ ప్రకారం జూన్ 3న దక్షిణాఫ్రికా జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితులలో ఆ మ్యాచ్‌ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.

    వివరాలు 

    ఐపీఎల్ చివరి మ్యాచ్ వరకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు

    ఈ నేపథ్యంలో, "మా షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.మేము జూన్ 3 నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సన్నాహకాలను ప్రారంభించబోతున్నాం,"అని క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోచ్ ఎంక్వే మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

    దీంతో ఐపీఎల్‌లో పాల్గొంటున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ జట్లకు చివరి మ్యాచ్ వరకు సహకరించనున్నారు.

    గుజరాత్ టైటాన్స్‌కు చెందిన కగిసో రబాడా,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న లుంగి ఎంగిడి,ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్,లఖ్నవూ సూపర్ జెయింట్స్‌కు క్రీడిస్తున్న ఐడెన్ మార్క్రమ్,ముంబయి ఇండియన్స్‌ తరఫున ఉన్న ర్యాన్ రికెల్టన్ మరియు కార్బిన్ బాష్, పంజాబ్ కింగ్స్‌కు చెందిన మార్కో జాన్సన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఉన్న వియాన్ ముల్డర్‌లు అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    తాజా

    IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    Minister Savita: వచ్చే నెలలో నేతన్నలకు ఆరోగ్య బీమా.. చేనేత,జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి  ఆంధ్రప్రదేశ్
    southwest monsoon: బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు
    Saraswathi Pushkaralu: సరస్వతి నది పుష్కరాలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు తెలంగాణ

    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! ఆస్ట్రేలియా
    విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు క్రికెట్
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్
    IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్  వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025