Page Loader
Virat Kohli: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025.. భారీ రికార్డుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025.. భారీ రికార్డుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ

Virat Kohli: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025.. భారీ రికార్డుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కేవలం ఆరు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగాటోర్నీ ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్యాంప్‌లో చేరాడు. ఈ సీజన్‌లో కోహ్లీ ఓ అద్భుతమైన మైలురాయిని అందుకునే అవకాశముంది. ఈ సీజన్‌లో ఒక్క సెంచరీ చేస్తే, టీ20 క్రికెట్‌లో 10 శతకాలు పూర్తి చేసుకుని ఈ ఫీట్‌ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ టాప్‌లో ఉండగా, రోహిత్ శర్మ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

Details

2016 సీజన్ లో నాలుగు శతకాలు

కోహ్లీ ఇప్పటి వరకు 399 టీ20 మ్యాచ్‌లు ఆడి 9 సెంచరీలు సాధించాడు. ఇందులో 8 ఐపీఎల్‌లో, 1 అంతర్జాతీయ టీ20లో నమోదయ్యింది. ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ కూడా కోహ్లీనే. 2016 ఐపీఎల్ సీజన్‌లో అతను ఏకంగా 4 సెంచరీలు కొట్టాడు. టీ20ల్లో అత్యధికంగా క్రిస్ గేల్ 22 సెంచరీలు, బాబర్ అజామ్ 11 సెంచరీలు, విరాట్ కోహ్లీ 9, మైకేల్ క్లింగర్ 9 సెంచరీలు, డేవిడ్ వార్నర్ 8 సెంచరీలు, జోస్ బట్లర్ 8 సెంచరీలు, రోహిత్ శర్మ 8 సెంచరీలు చేశారు. ఈసారి ఐపీఎల్‌లో కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే, టీ20 క్రికెట్‌లో అతని పేరు మరో కొత్త రికార్డుతో చరిత్రలో నిలిచిపోతుంది.