
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆరు వేదికల్లో 17 నుంచి ఐపీఎల్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 17వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ను మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) నిర్ణయం తీసుకుంది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న నిర్వహించనున్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ నెల 8న టోర్నమెంట్ను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు టోర్నీ మళ్లీ మొదలుకాబోతోంది. తిరిగి ప్రారంభం అయిన తర్వాత తొలి మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరుగుతుంది.
వివరాలు
త్వరలో ప్లేఆఫ్స్ వేదికల వివరాలు
లీగ్ దశలో మిగిలిన మ్యాచ్లు బెంగళూరు, జైపుర్, దిల్లీ, లఖ్నవూ, అహ్మదాబాద్, ముంబయి వంటి నగరాల్లో నిర్వహించనున్నారు.
ప్లేఆఫ్స్ వేదికల వివరాలను బీసీసీఐ త్వరలో వెల్లడించనుంది.
ఇక ఇప్పటి వరకు ఆగిపోయిన పంజాబ్ vs దిల్లీ మ్యాచ్ను కూడా కలిపి టోర్నీలో ఇంకా 17 మ్యాచ్లు జరగాల్సి ఉంది.
ప్రత్యేకించి, హైదరాబాద్లో జరగాల్సిన రెండు మ్యాచ్లను వేరొక చోటికి మార్చినట్లు బీసీసీఐ వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపిల్ఎల్ చేసిన ట్వీట్
🗓️ #TATAIPL 2025 action is all set to resume on 17th May 🙌
— IndianPremierLeague (@IPL) May 12, 2025
The remaining League-Stage matches will be played across 6⃣ venues 🏟️
The highly anticipated Final will take place on 3rd June 🏆
Details 🔽https://t.co/MEaJlP40Um pic.twitter.com/c1Fb1ZSGr2