IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్కు షాక్.. గాయాలతో చక్రవర్తి, నరైన్..స్పిన్నర్లు లేని మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
నేటి ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆటకు దూరమయ్యాయి. పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో వారు లేరు. ఈ విషయాన్ని కెప్టెన్ అజింక్య రహానే తెలిపారు. గాయం కారణంతో చక్రవర్తి అలాగే అనారోగ్య కారణంగా నరైన్ ఆట మిస్ అయ్యారని వెల్లడించారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారంగా.. 2019 ఏప్రిల్ తర్వాత తొలిసారి ఇద్దరు స్పిన్నర్లు మ్యాచ్కు దూరమయ్యారు.
వివరాలు
ఇది అరుదైన సంఘటన..
చక్రవర్తి తన చివరి మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడుతుండగా క్యాచ్ పట్టే సమయంలో గాయమైది. నరైన్ అనారోగ్యంతో ఆట ఆడలేకపోతున్నాడు. దీంతో కోల్కతా జట్టుకు ఇప్పుడు ఒకే ఒక్క స్పిన్నర్ అనుకుల్ రాయ్ మాత్రమే మిగిలాడు. ఇకపోతే వెస్టిండీస్ ఆల్రౌండర్ రోవ్మన్ పవెల్, ఇండియన్ పేసర్ నవదీప్ సైనా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించింది. నవదీప్ సైనా ఫ్రాంచైజీకి డెబ్యూట్ చేస్తున్నాడు. ఇది కోల్కతాకు అరుదైన సంఘటన. ఎందుకంటే గత ఏడు సంవత్సరాల్లో ఇలా స్పిన్నర్లు ఒక్కసారి కూడా మ్యాచ్ మిస్ కాలేదు. చివరి సారి ఇది 2019 ఏప్రిల్లో ఇలాంటి ఘటనే జరిగింది.
వివరాలు
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వివరాలివే
ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, అజింక్యా రాహానే (కెప్టెన్), కెమెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్-కీపర్), రోవ్మన్ పవెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనా, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి. మ్యాచ్కు ముందే కెప్టెన్ రహానే పిచ్ డ్రై అని తెలిపారు. ఇంపాక్ట్ సబ్లు: బ్లెస్సింగ్ ముజరబానీ, మనీష్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ డుబే.