NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు 
    తదుపరి వార్తా కథనం
    IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు 
    ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు

    IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    10:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ధర్మశాలలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

    స్టేడియంలోని ఫ్లడ్ లైట్లలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.

    స్టేడియం పరిధిలో విద్యుత్ సరఫరాలో వచ్చిన అంతరాయం వల్ల ఫ్లడ్‌లైట్లలో ఒకటి పనిచేయకుండా పోవడం దీని ప్రధాన కారణంగా గుర్తించారు.

    ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో, నిర్వాహకులు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

    స్టేడియానికి హాజరైన ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యం పట్ల బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) విచారం వ్యక్తం చేసింది.

    వివరాలు 

    ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జట్టుకు శుభారంభాన్ని అందించారు

    మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా ఆట ప్రారంభం ఒక గంట పాటు ఆలస్యం కాగా, చివరికి రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైంది.

    ఆట నిలిపివేసే సమయానికి పంజాబ్ కింగ్స్ జట్టు 10.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది.

    ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుతంగా ఆడి జట్టుకు శుభారంభాన్ని అందించారు.

    ప్రియాంశ్ ఆర్య 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు నమోదు చేశాడు, కాగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.

    ప్రియాంశ్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే మ్యాచ్‌ను రద్దు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు  ఐపీఎల్
    Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్ రాజ్‌నాథ్ సింగ్
    Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత దిల్లీ
    F-16 Shot Down: పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత్  భారతదేశం

    ఐపీఎల్

    SRH vs MI : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపు  క్రీడలు
    Arshdeep Singh: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌  క్రీడలు
    RCB-PBKS:  సొంత గడ్డపై చతికిల పడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 5 వికెట్ల తేడాతో  పంజాబ్ కింగ్స్ గెలుపు  క్రీడలు
    RR Vs LSG: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ పోరు..  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025