IPL Rohith Sharma: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎక్స్ పోస్ట్ లతో ఫ్యాన్స్ వార్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ గెలుపొందింది. దీంతో ఆ ముంబయి ఇండియన్స్ జట్టు ఐపీఎల్ లో బోణి కొట్టింది. దీంతో రోహిత్ శర్మ మంచి జోష్ లో ఉండి ఇది ఆరంభం మాత్రమే ...ఇంకా ముందుంది అన్న అర్థం వచ్చేలా చెక్ బోర్డు ప్లాగ్ ఎమోజీని పోస్ట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో మ్యాచ్ లో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma), షెఫర్డ్, ప్రాక్టీస్ లో ఉన్న ఇషాంత్, రిషబ్ పంత్ ఫొటోలను కూడా యాడ్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా (Hardik Pandya)కూడా తన ఎక్స్ ఖాతాలో స్పందించాడు.
ఘాటు సమాధానమిచ్చిన రోహిత్ శర్మ అభిమాని
మేము లేచి పరిగెడుతున్నాం అన్న క్యాప్షన్ తో పాటు జట్టు ఫొటోలు కూడా పోస్ట్ చేశాడు. ఇక్కడే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. రోహిత్ శర్మ ఆత్మన్యూనత తో ఉన్నాడని అందుకే అతడి సింగిల్ ఫొటోలు మాత్రమే పోస్ట్ చేశాడని అదే హార్దిక్ పాండ్యా జట్టు సభ్యుల ఫొటోను పోస్ట్ చేశాడు అని ఫ్యాన్స్ కామెంట్ చేశారు. దీనికి చిర్రెత్తుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని స్పందిస్తూ హర్దిక్ ఆడిందేముంది మ్యాచ్లో...రోహిత్ ఆడాడు గనుక పోస్ట్ చేశాడని ఘాటు సమాధానమిచ్చాడు.