Page Loader
Jason Gillespie: పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్ప్పుకున్న జాసన్ గిలెస్పీ
పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్ప్పుకున్న జాసన్ గిలెస్పీ

Jason Gillespie: పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్ప్పుకున్న జాసన్ గిలెస్పీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్‌లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గ్యారీ కిరిస్టెన్ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జాసన్ గిలెస్పీ కూడా కోచింగ్ బాధ్యతలుకు గుడ్ బై చెప్పేశాడు. అతడు 2026 వరకు పదవిలో ఉండాల్సి ఉండగా, అర్థిక కారణాల వల్ల వీడటంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గ్యారీ కిరిస్టెన్ వెళ్ళిపోయిన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు గిలెస్పీని ప్రధాన కోచ్‌గా నియమించింది. అయితే, డిసెంబర్ 26 నుండి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ముందు గిలెస్పీ స్థానంలో తాత్కాలికంగా కోచింగ్ బాధ్యతలను ఆకిబ్ జావెద్ తీసుకోవడం జరిగింది. కోచింగ్ బృందంలో టిమ్ నీల్సన్‌ను తొలగించడం, బోర్డు నిర్ణయాలతో గిలెస్పీ అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

వివరాలు 

గ్యారీ కిరిస్టెన్ విషయంలోనూ.. 

జట్టు ఎంపికలో గిలెస్పీ సహకరించడమే కాకుండా, పీసీబీ అతన్ని తప్పించడానికి కారణమయ్యాడని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. గ్యారీ కిరిస్టెన్ విషయంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. కిరిస్టెన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్‌గా రెండు సంవత్సరాల కాంట్రాక్ట్‌పై వచ్చి, పాక్ జట్టుకు కోచింగ్ ఇచ్చాడు. కానీ 2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండటంతో పీసీబీ అతడిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు లోపలి వివాదాల కారణంగా కిరిస్టెన్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత గిలెస్పీకి పరిమిత ఓవర్ల క్రికెట్ కోచింగ్ బాధ్యతలు అప్పగించబడినప్పటికీ, కొందరు బోర్డు సభ్యులు ఆకిబ్ జావెద్‌ను తీసుకురావాలని ప్రేరేపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

వివరాలు 

జట్టు ఎంపికకు సంబంధించిన అన్ని అధికారాలను ఆకిబ్ జావెద్‌కు..

ఇప్పుడు, గిలెస్పీ స్థానంలో ఆకిబ్ జావెద్‌కు బాధ్యతలు అప్పగించడం పాక్ క్రికెట్ బోర్డు నుండి కీలక నిర్ణయంగా మారింది. జట్టు ఎంపికకు సంబంధించిన అన్ని అధికారాలను ఆకిబ్ జావెద్‌కు ఇవ్వడం కూడా గమనార్హం. ఇదిలా ఉంటే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అతడిపై కేసు నమోదు చేయబడింది. అయితే, ఈ కేసు విచారణను లాహోర్ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 16 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని కోర్టు పేర్కొంది.

వివరాలు 

బాబర్ కేసు విచారణ వాయిదా 

బాబర్‌తో సంబంధం ఉన్న మహిళ ఒక పిటిషన్‌లో, అతడు వివాహం చేసుకోవడానికి ప్రామిస్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. ఈ నేపధ్యంలో బాబర్ అజామ్ సీనియర్ లాయర్ కోర్టుకు హాజరుకాలేదు. అతడి జూనియర్ లాయర్ విజ్ఞప్తి మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం బాబర్ అజామ్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు, అక్కడ టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నాడు.