NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / AUS vs IND: డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం.. ఆటగాళ్ల ముందు కీలక మైలురాళ్లు 
    తదుపరి వార్తా కథనం
    AUS vs IND: డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం.. ఆటగాళ్ల ముందు కీలక మైలురాళ్లు 

    AUS vs IND: డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం.. ఆటగాళ్ల ముందు కీలక మైలురాళ్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్‌ డే టెస్టుకు టీమిండియా, ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నాయి.

    ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల ముందున్న రికార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

    ముఖ్యంగా, టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కీలక లక్ష్యాలను చేరేందుకు సమాయత్తమవుతున్నారు.

    జస్ప్రిత్ బుమ్రా,ఈ టోర్నీలో టీమ్‌ఇండియా పేస్ దళాన్ని విజయవంతంగా ముందుండి నడిపిస్తూ, మరిన్ని వికెట్లు సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు.

    ఇంకా ఆరు వికెట్లు పడగొట్టినట్లయితే, టెస్టుల్లో 200 వికెట్లు సాధించిన భారత పేసర్ల జాబితాలో స్థానం సంపాదిస్తాడు.

    వివరాలు 

    స్మిత్ 191 పరుగులు సాధిస్తే టెస్టుల్లో పది వేల పరుగులు

    ఇప్పటివరకు ఈ ఘనత కేవలం ఐదుగురు భారత పేసర్లు, కపిల్‌దేవ్‌, ఇషాంత్‌శర్మ, జవగళ్‌శ్రీనాథ్‌, మహ్మద్‌ షమీ తదితరులు మాత్రమే సాధించారు.

    మొత్తం మీద, భారత బౌలర్లలో 11 మంది మాత్రమే ఈ మైలురాయికి చేరుకున్నారు. బుమ్రా ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఈ రికార్డు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

    ఇక స్టీవ్ స్మిత్ విషయానికి వస్తే,అతడికి ఇంకో 191 పరుగులు సాధిస్తే టెస్టుల్లో పది వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరుతాడు.

    ఈ ఘనత సాధిస్తే,అలన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, రికీ పాంటింగ్‌ల తరువాత నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలుస్తాడు.

    గత టెస్టులో ట్రావిస్ హెడ్‌తో కలిసి సెంచరీ చేసిన స్మిత్‌కి ఈ లక్ష్యం చేరడం కష్టమేమీ కాదు.

    వివరాలు 

    మూడో టెస్టు డ్రా.. టోర్నీలో ఉత్కంఠ

    2014లో ఇదే మెల్‌బోర్న్ మైదానంలో స్మిత్ 192 పరుగులతో భారత్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతిని గుర్తించాలి.

    డిసెంబర్‌ 26 నుంచి ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది.

    ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు అత్యంత కీలకమైంది, ఎందుకంటే ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగియడం టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    జడేజా, అశ్విన్‌ సమక్షంలో స్వదేశంలో భారత్ రెండు టెస్టు ఓటములు క్రికెట్
    WTC: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా
    IND vs AUS: ఆహ్మదాబాద్ టెస్టులో రాహుల్-గిల్‌ని ఆడించాలి : రికి పాటింగ్ క్రికెట్
    IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025