NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం 
    తదుపరి వార్తా కథనం
    Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం 
    Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం

    Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2024
    03:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

    జనవరి 31న బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    బీసీసీఐ కార్యదర్శిగా కూడా ఉన్న షా రెండోసారి ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జై షా మొట్టమొదటి సారిగా జనవరి 2021లో పగ్గాలు చేపట్టాడు.

    జనవరి 2021లో,బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ స్థానంలో అతి పిన్న వయస్కుడైన షా ACC అధ్యక్షుడయ్యాడు.

    హసన్ (2016-2018) కంటే ముందు పాకిస్థాన్‌కు చెందిన ఎహసాన్ మణి ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

    ఇదిలా ఉండగా,ఎన్ శ్రీనివాసన్ (2012-2014) తర్వాత ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు షా.

    Details 

    ACC సభ్యులందరూ ఏకగ్రీవంగా నామినేషన్‌

    వరుసగా మూడోసారి ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జై షాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ACC ప్రెసిడెన్సీ పూర్తిగా ICC సభ్యుల మధ్య తిరుగుతూ ఉండటం గమనార్హం.

    షమ్మీ సిల్వా జై షాను ఈ పదవి కోసం ప్రతిపాదించారు.పత్రికా ప్రకటనలో పేర్కొన్నట్లుగా ACC సభ్యులందరూ ఏకగ్రీవంగా నామినేషన్‌కు మద్దతు ఇచ్చారు.

    ఏసీసీ అధ్యక్షుడిగా ఎక్కువసార్లు ఆ పదవీని చేపట్టిన ఏకైక అడ్మినిస్ట్రేటర్ షా.

    ఆసియాలో క్రికెట్‌ను ప్రోత్సహించి, అభివృద్ధి చేయడంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను గణనీయమైన పురోగతి వైపు నడిపించడంలో జే షా కీలక పాత్ర పోషించాడని SLC చీఫ్ సిల్వా చెప్పారు.

    Details 

    2023 ఆసియా కప్ లో హైబ్రిడ్ మోడల్‌

    భారత్,బంగ్లాదేశ్,పాకిస్తాన్,శ్రీలంక,ఓమన్, నేపాల్ వంటి దేశాల్లోనూ క్రికెట్ అభివృద్దికి జై షా కృషి చేశారని ఏసీసీ బోర్డు సభ్యులు కొనియాడారు.

    షా హయాంలో, ACC 2022 (T20 ఫార్మాట్), 2023 (ODI ఫార్మాట్)లో రెండు ఆసియా కప్ ఎడిషన్‌లను విజయవంతంగా నిర్వహించింది.

    2023 ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇక్కడ పాకిస్తాన్ ,శ్రీలంక సంయుక్తంగా ఆరు జట్ల ఈవెంట్‌ను నిర్వహించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్

    క్రికెట్

    IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్ ఐపీఎల్
    Happy Birthday Yuvraj Singh: యువరాజ్.. ది బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. హ్యాపీ బర్తడే సిక్సర్ల కింగ్! యువరాజ్ సింగ్
    Jofra Archer: బార్బడోస్ క్లబ్ తరుఫున బరిలో జోఫ్రా ఆర్చర్.. సమచారం లేదన్న ఈసీబీ  ఇంగ్లండ్
    Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు రింకూ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025