NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత
    తదుపరి వార్తా కథనం
    టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత
    దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

    టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 31, 2023
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా ఆటగాళ్లపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు స్టార్ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే వారి నిబద్ధతను ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ నిలదీశారు.

    ఇండియన్ క్రికెటర్లు తమకే అన్నీ తెలుసన్నట్లు భావిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరినీ సలహా అడగాలని కోరుకోరని చురకలు అంటించారు.

    కీలక ఆటగాళ్లు గాయాలపాలు కావడంతో రానున్న మెగా టోర్నీల్లో జట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు.

    చిన్న గాయాలైనా ఐపీఎల్‌లో ఆడేందుకు అభ్యంతరం చెప్పని ఆటగాళ్లు, జాతీయ జట్టుకు ఆడటంలో మాత్రం చిన్న గాయాలనే సాకులుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం తరఫున ఆడమంటే విశ్రాంతి తీసుకునేందుకే ఇష్టపడుతున్నారని కపిల్‌ అన్నారు.

    details

    ఆటగాళ్ల పని భారం నిర్వహణపై బీసీసీఐ సరిగ్గా స్పందించట్లేదు : కపిల్ దేవ్

    ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉంటున్నారని, ఇది సరైన దారేనా అంటూ కపిల్ ప్రశ్నించారు. గాయంతో ఏడాదిగా స్టార్‌ పేసర్‌ బుమ్రా జట్టుకు దూరమయ్యాడని ఆయన గుర్తు చేశారు.

    వచ్చే ఆసియా కప్, ప్రపంచకప్‌ కోసం అతడు సిద్ధంగా లేకుంటే పరిస్థితి ఏంటన్నారు. మరోవైపు రిషభ్‌ పంత్‌ పైనా స్పందించారు. అతనో గొప్ప క్రికెటర్‌ అని, అతడు అందుబాటులో ఉండి ఉంటే టెస్ట్ క్రికెట్‌ మరింత బాగుండేదన్నారు.

    ఐపీఎల్‌ గొప్పదే, కాదనను కానీ అది మిమ్మల్ని(ఆటగాళ్లను) దెబ్బతీస్తోందని సున్నితంగా హెచ్చరించారు. ఆటగాళ్లకు ఐపీఎల్ లాంటి పరిస్థితులు టీమిండియాలో ఎదురైతే మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఆటగాళ్ల పని భారం నిర్వహణపై ఇటు బీసీసీఐ (BCCI) సైతం సరిగ్గా పనిచేయట్లేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    టీమిండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    క్రికెట్

    ముగ్గురు భారత ఆటగాళ్లను వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్! లక్నో సూపర్‌జెయింట్స్
    టీమిండియాతో టెస్టు సిరీస్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన విండీస్! వెస్టిండీస్
    వెస్టిండీస్ దిగ్గజంతో టీమిండియా ప్లేయర్లు   టీమిండియా
    IND vs WI: భారత జట్టులోకి తెలుగోడు.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి టీమిండియా

    టీమిండియా

    మూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం బంగ్లాదేశ్
    Ind vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్ రోహిత్ శర్మ
    Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు విరాట్ కోహ్లీ
    టెస్టుల్లో హిట్ మ్యాన్ ప్రభంజనం..  రోహిత్ ఖాతాలో పలు రికార్డులు  రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025