Page Loader
సంక్షిప్తం చేయు
Karun Nair: ఏడేళ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్‌ నాయర్‌.. బీసీసీఐ పోస్ట్‌తో క్లారిటీ..!
ఏడేళ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్‌ నాయర్‌.. బీసీసీఐ పోస్ట్‌తో క్లారిటీ..!

Karun Nair: ఏడేళ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్‌ నాయర్‌.. బీసీసీఐ పోస్ట్‌తో క్లారిటీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరికొద్ది గంటల్లోనే ఇంగ్లండ్ జట్టుతో భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది.

ఈసిరీస్‌తో కరుణ్‌ నాయర్‌ ఏడేళ్ల తర్వాత మరోసారి భారత క్రికెట్‌ జట్టులోకి తిరిగి వచ్చాడు.

అయితే,ఈసిరీస్‌లో అతడికి ఆడే అవకాశం కలుగుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా, బీసీసీఐ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో అతడు తుది జట్టులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు అభిమానులు.

బీసీసీఐ తమ అధికారిక'ఎక్స్‌'ఖాతాలో "కరుణ్‌ నాయర్‌.. రెడీ టు గో..!" అంటూ పోస్టు చేసి, సిరీస్‌ మొదలయ్యే ముందు అతడు మాట్లాడిన ఓ వీడియోను షేర్‌ చేసింది.

ఈ వీడియో నేపథ్యంలో అభిమానులు అతడిని ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్ట్‌లో తుది జట్టులో ఉంటాడని భావిస్తున్నారు.

వివరాలు 

అదే ఆలోచన నా శ్రమకు బలం ఇచ్చింది

నంబర్ 3 స్థానంలో అతడిని తీసుకుంటే బాగుంటుందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్‌ అవుతోంది.

ఆ వీడియోలో కరుణ్‌ నాయర్‌ మాట్లాడుతూ.."జీవితం ఒక వలయం లాంటిది. గతంలో ఇంగ్లాండ్‌ సిరీస్‌ నుంచే నేను జాతీయ జట్టుకు దూరమయ్యాను. ఇప్పుడు మళ్లీ అదే ఇంగ్లాండ్‌ సిరీస్‌ ద్వారా జట్టులోకి వచ్చాను. ప్రతిరోజూ నిద్రలేచిన వెంటనే నా మనసులో వచ్చే తొలి ఆలోచన - భారత్‌ తరఫున మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలనే ఉత్సాహమే. అదే ఆలోచన నా శ్రమకు బలం ఇచ్చింది. సాధనకు ప్రేరణ కలిగించింది. ఈ జెర్సీ మళ్లీ ధరించడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గౌరవంగా అనిపిస్తోంది" అని చెప్పారు.

వివరాలు 

కరుణ్‌ నాయర్‌ భారత జట్టును వదిలింది ఇంగ్లాండ్‌ పర్యటన సమయంలోనే..

కరుణ్‌ నాయర్‌ 2018లో భారత టెస్టు జట్టులో భాగంగా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాడు.

కానీ,ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోకూడా తుది జట్టులో స్థానం దక్కలేదు.

సెలక్టర్లు కూడా అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఇటీవల రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో తిరిగి ఇంగ్లాండ్‌ పర్యటన కోసం అతడిని ఎంపిక చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,అతడు భారత జట్టును వదిలింది ఇంగ్లాండ్‌ పర్యటన సమయంలోనే.. ఇప్పుడు అదే ఇంగ్లాండ్‌ పర్యటన ద్వారానే జట్టులోకి పునరాగమనం చేస్తున్నాడు.

ఇటీవలే రోహిత్‌ శర్మ,విరాట్‌ కోహ్లీ తమ టెస్ట్‌ కెరీర్‌కు ముగింపు పలకడంతో, కరుణ్‌ నాయర్‌కి జట్టులో స్థానం కోసం అవకాశాలు మెరుగయ్యాయి.

ప్రస్తుతానికి టీమ్‌ఇండియా శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ ఆడుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ చేసిన ట్వీట్