Page Loader
ENG vs IND: ఎడ్జ్‌బాస్టన్‌లో కోహ్లీ రికార్డుపై మళ్లీ సవాల్.. సెంచరీ హీరోగా ఎవరు నిలుస్తారు?
ఎడ్జ్‌బాస్టన్‌లో కోహ్లీ రికార్డుపై మళ్లీ సవాల్.. సెంచరీ హీరోగా ఎవరు నిలుస్తారు?

ENG vs IND: ఎడ్జ్‌బాస్టన్‌లో కోహ్లీ రికార్డుపై మళ్లీ సవాల్.. సెంచరీ హీరోగా ఎవరు నిలుస్తారు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ వర్సెస్ భారత్‌ రెండో టెస్టుకు బర్మింగ్‌హామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం వేదికగా మారనుంది. ఇప్పటివరకు ఈ మైదానంలో టీమిండియా ఒక్క టెస్టు కూడా గెలవలేదు. తొలి టెస్టు ఓటమితోనే నెమ్మదించిపోయిన భారత జట్టు కోసం ఇది మరింత సవాలుగా మారనుంది. అయితే ఇక్కడ భారత ఆటగాళ్లు సెంచరీలు చేసిన సందర్భాలున్నా, విజయం మాత్రం దక్కలేదు. మరి ఆ చరిత్రలో నిలిచిపోయిన భారత క్రికెటర్లు ఎవరు? మరిన్ని ఆసక్తికర విశ్లేషణలు చూద్దాం.

Details

ఎడ్జ్‌బాస్టన్‌లో సెంచరీ చేసిన భారత బ్యాటర్లు

ఈ మైదానంలో టెస్టు చరిత్రలో ఇప్పటివరకు 86 సెంచరీలు నమోదయ్యాయి. అయితే భారత్‌ తరఫున కేవలం నలుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు. సచిన్ తెందుల్కర్ (1996): 122 పరుగులు విరాట్ కోహ్లీ (2018): 149 పరుగులు రిషబ్ పంత్ (2022): 146 పరుగులు రవీంద్ర జడేజా (2022): 104 పరుగులు ఈ నాలుగూ భారత్‌కు విజయాన్ని తేవలేకపోయాయి. ఇక కోహ్లీ రికార్డును అధిగమించాలంటే ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన బ్యాటర్లపై ఆశలు నెలకొన్నాయి.

Details

వికెట్ల పరంగా చేతన్‌ శర్మ టాప్‌లో

ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ ఈ మైదానంలో 14 టెస్టుల్లో 52 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌ తరపున మాత్రం ఇప్పటికీ చేతన్‌ శర్మనే టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. 1986లో జరిగిన మ్యాచ్‌లో ఆయన 10 వికెట్లు తీశారు. భారత్‌ తరఫున ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదే బెస్ట్ ఫిగర్. ఇది దాదాపు 39 ఏళ్ల క్రితం నమోదు కావడం గమనార్హం. ఈసారి బుమ్రా అందుబాటులో లేకపోవడం బౌలింగ్ యూనిట్‌పై మరింత ఒత్తిడిగా మారనుంది.

Details

ఎడ్జ్‌బాస్టన్‌ స్టాట్స్ - మరిన్ని విశేషాలు

మొత్తం 56 టెస్టులు జరిగాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జట్లు - 29 విజయాలు బౌలింగ్ మొదలుపెట్టిన జట్లు - 12 విజయాలు డ్రా మ్యాచ్‌లు - 15 అత్యధిక టోటల్: ఇంగ్లాండ్‌ - 710/7 vs భారత్ (2011) అత్యల్ప స్కోరు: పాకిస్థాన్‌ - 72 vs ఇంగ్లాండ్ (2010) భారత్‌ అత్యధిక స్కోరు: 416 (1989) చివరి మ్యాచ్‌లో భారత్‌ 274 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. 2022లో ఇంగ్లాండ్‌ 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచినందున, ఇది ఇప్పటివరకు ఆ మైదానంలో అత్యధిక ఛేజింగ్‌ విజయంగా నమోదైంది. ఇన్నిపరిణామాల మధ్య టీమిండియా ఈసారి విజయ రేఖను దాటి ముందుకు సాగుతుందా, లేదా అనేది ఆసక్తికరమే.