NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌!
    ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌!

    Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 04, 2025
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2025 ఐపీఎల్‌ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతూ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.

    మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

    ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

    అనంతరం ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    Details

     పంజాబ్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ స్పందన

    ఫైనల్‌ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ''ఈ ఓటమి నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.

    ఫైనల్లో ఓడినా మా యువ ఆటగాళ్లు గొప్పగా పోరాడారు. ఈ మ్యాచ్‌లో ఓడాల్సిన అవసరం లేదు. గత మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని తేలికగా చేధించాం. కానీ ఈ రోజు ఆర్సీబీ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

    ముఖ్యంగా కృనాల్ పాండ్యా తన అనుభవంతో మ్యాచ్ మలుపు తిప్పాడు.

    మా జట్టులో చాలామంది తమ తొలి ఐపీఎల్‌ సీజన్‌ ఆడినా, భయంలేని ఆట చూపారు. వచ్చే ఏడాది మళ్లీ టైటిల్ కోసం బరిలో దిగుతామని వ్యాఖ్యానించాడు.

    Details

    రాణించిన కృనాల్ పాండ్యా

    ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బాగా రాణించలేకపోయాడు. కేవలం 1 పరుగుతోనే పెవిలియన్‌కి చేరాడు.

    అయితే చివర్లో శశాంక బలంగా పోరాడాడు. 30 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ అది పంజాబ్ విజయానికి సరిపోలేదు. జోష్ ఇంగ్లిస్ 39 (23 బంతుల్లో), ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 (22 బంతుల్లో) పరుగులు చేశారు.

    ఆర్సీబీ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.

    దీంతో ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. 2008 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్‌ చేరినా 2025లో ఆ కల సాధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్‌ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    IPL 2025 Final: నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయం‌పై విజయ్ మాల్యా హర్షం! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Flipkart: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ నుంచి నిష్క్రమించిన ఫ్లిప్‌కార్ట్  ఫ్లిప్‌కార్ట్
    Ganta Srinivas : శాశ్వతంగా రాజకీయాలకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం: గంటా సంచలన ప్రకటన  గంటా శ్రీనివాసరావు

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    దంచికొట్టిన ఆర్‌సీబీ బ్యాటర్లు; ముంబై ఇండియన్స్‌ లక్ష్యం 200పరుగులు ఐపీఎల్
    సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం  ఐపీఎల్
    RCB vs SRH: హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ; 186 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్  ఐపీఎల్
    RCB vs SRH: సెంచరీతో అదరగొట్టన కోహ్లీ; ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ విజయం ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025