IND vs SL : భారత్పై నాలుగు వికెట్లతో విజృంభించిన మతీషా పతిరనా
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మొదటి టీ20ల్లో శ్రీలంక తరుఫున యువ పేసర్ మతీషా పతిరనా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇండియాతో ఆడుతున్న మొదటి మ్యాచులోనే నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కేవలం నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి, 40 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచులో 58 పరుగులతో చెలరేగిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటగా పతిరణ ఔట్ చేశారు.
భారీ స్కోరు చేసిన భారత్
తర్వాత పతిరనా దెబ్బకు హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7), రిషబ్ పంత్ (49) వంటి టాప్ బ్యాటర్లు ఔట్ అయ్యారు. పతిరణ పొదుపుగా బౌలింగ్ చేయగా, మిగిలిన బౌలర్లకు ఆ జట్టుకు సహకారం లభించలేదు. పతిరణ ఇప్పటివరకూ 10 అంతర్జాతీయ మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 213/7 భారీ స్కోరు చేసింది. మూడవ అత్యధిక స్కోరుగా శ్రీలంకపై టీమిండియా క్రియేట్ చేసింది.