NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ms Dhoni Case: 15 కోట్ల మోసం కేసులో మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Ms Dhoni Case: 15 కోట్ల మోసం కేసులో మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్ 
    15 కోట్ల మోసం కేసులో మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్

    Ms Dhoni Case: 15 కోట్ల మోసం కేసులో మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2024
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వ్యాపార భాగస్వామిగా ఉన్న మిహిర్ దివాకర్ అరెస్టయ్యాడు.

    15 కోట్ల మోసం చేశారంటూ మిహిర్‌పై ధోనీ క్రిమినల్ కేసు పెట్టారు. ధోనీ ఫిర్యాదు మేరకు మిహిర్‌పై ఐపీసీ 406, 420, 467, 468, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    రాంచీ జిల్లా కోర్టులో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌పై ఈ ఫిర్యాదు దాఖలైంది.

    మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. మిహిర్‌ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఎంఎస్ ధోని పేరును దుర్వినియోగం చేసి జైపూర్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

    Details 

    అసలు ఏమి జరిగిందంటే? 

    జైపూర్ పోలీస్ కమీషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపిన వివరాల ప్రకారం, జైపూర్‌లోని గాంధీ పంత్ ప్రాంతంలో ఎంఎస్ ధోని పేరిట క్రికెట్ అకాడమీని ప్రారంభించడంలో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై దివాకర్‌పై కేసు నమోదైంది.

    మిహిర్ దివాకర్ 2017లో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు మహేంద్ర సింగ్ ధోనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

    కానీ అగ్రిమెంట్ లో పేర్కొన్న షరతులను దివాకర్ పాటించలేదు. ఈ కేసులో ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఫీజు చెల్లించాల్సి వచ్చింది.

    ఒప్పందం ప్రకారం, లాభం పంచుకోవాలి, కానీ ఒప్పందంలోని అన్ని నిబంధనలు, షరతులు ఉల్లంఘించారు.

    Details 

    ధోనీ పేరుతో దాదాపు రూ.15 కోట్ల మోసం

    దీని తర్వాత ధోనీ మిహిర్, అతని కంపెనీ నుండి అన్ని హక్కులను లాగేసుకున్నాడు. కానీ దీని తర్వాత కూడా, మిహిర్ ధోని పేరును ఉపయోగించాడు.

    దేశ ,విదేశాలలో అనేక క్రికెట్ అకాడమీలను ప్రారంభించాడు. ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ, ఎంఎస్ ధోనీ స్పోర్ట్స్ అకాడమీ కోసం డబ్బు తీసుకుని ధోనీని మోసం చేశాడని మిహిర్‌పై ఆరోపణలు వచ్చాయి.

    ఈ విధంగా ధోనీ పేరుతో దాదాపు రూ.15 కోట్ల మోసం జరిగింది.

    ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, మేధో సంపత్తి హక్కులు (IPR) గురించి చర్చ మళ్లీ తీవ్రమైంది.

    వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదైనా ప్రముఖుడి పేరును దుర్వినియోగం చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొవలిసి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని

    తాజా

    Donald Trump: రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై అమెరికా-చైనా డీల్.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్
    CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం
    Mangli : మంగ్లీ పుట్టినరోజు వేడుకలు.. FIR కాపీలో సంచలన విషయాలు తెలంగాణ
    Kuberaa: 'ఆనంద్' నుంచి 'కుబేర' వరకు.. శేఖర్ కమ్ముల టాప్ 5 మూవీస్ చూశారా? అస్సలు మిస్ కావొద్దు!  టాలీవుడ్

    ఎంఎస్ ధోని

    తన వైపు నుంచి సీఎస్కేకు పెద్ద బహుమతి.. రిటైర్మెంట్‌పై ధోనీ క్లారిటీ ఐపీఎల్
    చివరి ఓవర్లో టెన్షన్ పడ్డ ఎంఎస్ ధోనీ.. గెలిచాక కన్నీళ్లు (వీడియో) ఐపీఎల్
    IPL 2023: ధోని చేసిన పనికి ఎమోషనల్ అయిపోయిన అంబటిరాయుడు  ఐపీఎల్
    ఎంఎస్ ధోని మార్కు అంటే ఇదే.. వారిని ఆడించి విజేతగా నిలిపాడు ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025