Page Loader
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన పాకిస్తాన్ మహిళా ప్లేయర్

టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన పాకిస్తాన్ మహిళా ప్లేయర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2023
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహిళల టీ20లలో శతకం బాదిన మొదటి పాకిస్తాన్ మహిళా ప్లేయర్ మునీబా చరిత్ర సృష్టించింది. 68 బంతుల్లో 102 పరుగులు (14 బౌండరీలు) చేసింది. దీంతో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జవేరియా ఖాన్ (6), కెప్టెన్ బిస్మా మరూఫ్ (4) పెద్దగా రాణించకపోయినా ఓపెనర్ నిదా దార్ (33)తో కలిసి మూడో వికెట్‌కు 101 పరుగులను మునీబా జోడించింది.

మునీబా

సెంచరీ చేసిన ఆరో ప్లేయర్‌గా మునీబా

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన ఆరో ప్లేయర్‌గా మునీబా రికార్డుకెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్, వెస్టిండీస్ చెందిన హేలీ మాథ్యూస్ మాత్రమే గతంలో సెంచరీ సాధించారు. గతంలో లానింగ్ (126), డబ్ల్యూఐకి చెందిన డియాండ్రా డాటిన్ (112*), ఇంగ్లండ్‌కు చెందిన హీథర్ నైట్ (108*), భారత్‌కు చెందిన హర్మన్‌ప్రీత్ కౌర్ (103), దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్ లీ (101) మాత్రమే మహిళల టీ20 ప్రపంచకప్‌లలో సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. మునీబా 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఆమె ఇప్పటివరకు 45 మ్యాచ్‌ల్లో 1 655 పరుగులు చేసింది.