Page Loader
Nitish Kumar Reddy: రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి
రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి

Nitish Kumar Reddy: రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు. ఒకే మ్యాచ్‌లో 70కి పైగా పరుగులు చేయడం, బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20ల్లో ఏ భారతీయుడు కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న రెండో యువ భారత ఆటగాడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో,బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా, తర్వాత నితీష్ రెడ్డి, రింకూ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరుకు పునాది వేశారు.

వివరాలు 

బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన 

రింకూ సింగ్, నితీష్ మధ్య నాలుగో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ నేపథ్యంలో నితీష్ రెడ్డి తన మొదటి టీ20 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. నితీష్ రెడ్డి వేగంగా ఆడి 34 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను నాలుగు ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్‌లో తన మ్యాజిక్‌ను చాటిన నితీష్ కుమార్ బౌలింగ్‌లోనూ అద్భుతంగా ప్రదర్శించాడు. నితీష్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు, ఒకే టీ20 మ్యాచ్‌లో 70కి పైగా పరుగులు చేసి, రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

వివరాలు 

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన రెండో అతి పిన్న వయస్కుడు నితీష్ 

అద్భుతమైన ఆటతీరుతో నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు (Player of the match) కూడా లభించింది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నితీష్ నిలిచాడు. నితీష్ 21 సంవత్సరాలు 136 రోజుల వయసులో టైటిల్ గెలుచుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (Rohith Sharma) అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 20 సంవత్సరాలు 143 రోజుల వయసులో మొదటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను అందుకున్నాడు.