NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Digvesh Rathi: మళ్లీ నోటుబుక్ సెలబ్రేషన్స్.. ఈసారి దిగ్వేశ్ ప్లాన్ ఏంటీ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Digvesh Rathi: మళ్లీ నోటుబుక్ సెలబ్రేషన్స్.. ఈసారి దిగ్వేశ్ ప్లాన్ ఏంటీ!
    మళ్లీ నోటుబుక్ సెలబ్రేషన్స్.. ఈసారి దిగ్వేశ్ ప్లాన్ ఏంటీ!

    Digvesh Rathi: మళ్లీ నోటుబుక్ సెలబ్రేషన్స్.. ఈసారి దిగ్వేశ్ ప్లాన్ ఏంటీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచాడు.

    ఇప్పటికే రెండుసార్లు జరిమానా విధించుకున్న ఈ యువ బౌలర్, తాజా మ్యాచ్‌లో మరో వివాదాస్పద సంబరంతో మూడోసారి జరిమానాకు గురవుతాడనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

    పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేసిన అనంతరం, తనదైన స్టైల్లో 'నోట్‌బుక్ సెలబ్రేషన్' చేస్తూ తన సంబరాలతో మరోసారి విమర్శలకు లోనయ్యాడు.

    దీని వల్ల ఐపీఎల్ కోడ్ ఆఫ్ కన్డక్ట్ ఉల్లంఘనకు సంబంధించి అతనిపై చర్యలు తీసుకోవడం ఖాయమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు లక్నో జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్‌పై స్పందించాడు.

    Details

    మూడు మ్యాచుల్లో విజయం సాధించే అవకాశం

    మేము తొలి ఇన్నింగ్స్‌లోనే ఎక్కువ పరుగులు ఇచ్చేశాం. ముఖ్యమైన క్యాచ్‌లు పడిపోవడంతో ప్రత్యర్థికి మెరుగైన స్కోరు చేసే అవకాశం దక్కింది.

    అయితే, మిగిలిన మూడు మ్యాచుల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. టాప్ ఆర్డర్‌లో కొంత మద్దతు లభించి ఉంటే ఛేదన సులభంగా సాగేది.

    ప్రతి మ్యాచ్‌లో ఒక్కరే రాణించాలని ఆశించడం సరైంది కాదంటూ వ్యాఖ్యానించాడు. అటు కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బ్యాట్స్‌మెన్ ఆయుష్ బదోని తన ఆటపై విశ్వాసం వ్యక్తం చేశాడు.

    ''నేను, సమద్ క్రీజ్‌లో ఉన్నప్పుడు గెలుపు నిశ్చయమని అనిపించింది.

    Details

    ఆయుష్ పోరాటం వృథా

    జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆడే అవకాశం నాకు చాలామంతు స్ఫూర్తినిస్తుంది.

    పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉన్నా, ఫాస్ట్ బౌలర్లకూ సహకరించింది. మ్యాచ్ ఆడేందుకు ఇది చక్కటి పిచ్'' అని చెప్పాడు. కాగా, పంజాబ్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్‌నవూ 199 పరుగులకే పరిమితమైంది.

    ఆయుష్ 40 బంతుల్లో 74 పరుగులు చేసి పోరాటం సాగించినా, జట్టు పరాజయాన్ని తప్పించలేకపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఐపీఎల్

    IPL 2025: ఉత్కంఠంగా ఆరెంజ్ క్యాప్ రేసు.. టాప్ బ్యాటర్ల మధ్య హీట్ ఫైట్! క్రికెట్
    Punjab Kings: పంజాబ్ కింగ్స్ గట్టి ఎదురుదెబ్బ.. టోర్నీ మధ్యలో కీలక ఆటగాడు ఔట్! క్రికెట్
    SRH: సన్ రైజర్స్ లోకి మరో విధ్వంసకర బ్యాటర్.. ఎవరీ స్మరన్ రవిచంద్రన్? సన్ రైజర్స్ హైదరాబాద్
    SRH net worth :సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ వర్త్ ఎంతంటే? టాప్ ప్లేయర్ సంపద చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! సన్ రైజర్స్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025