LOADING...
Shoaib Akhtar: 'మా ఐన్‌స్టీన్‌ పిచ్‌ను అర్థం చేసుకోకుండానే మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు : షోయబ్ ఆక్తర్
'మా ఐన్‌స్టీన్‌ పిచ్‌ను అర్థం చేసుకోకుండానే మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు : షోయబ్ ఆక్తర్

Shoaib Akhtar: 'మా ఐన్‌స్టీన్‌ పిచ్‌ను అర్థం చేసుకోకుండానే మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు : షోయబ్ ఆక్తర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సెప్టెంబర్‌ 14న ఆసియా కప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌పై పాకిస్థాన్‌ ప్రస్తుత కెప్టెన్‌ సల్మాన్‌ అలీ అఘాను తీవ్రంగా విమర్శించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని షోయబ్‌ ఆక్తర్‌ వ్యక్తం చేశారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిరాశకర ప్రదర్శనతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా ఈ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలో, మరో ఏడు వికెట్లు మిగిలించుకుంటూ ఘన విజయం సాధించింది. షోయబ్‌ అక్తర్‌ విమర్శల ప్రకారం, "సూర్యకుమార్‌ యాదవ్‌ టాస్‌ సమయంలో మొత్తం పిచ్‌ రిపోర్ట్‌ను ఇచ్చాడు.

Details

మొదట బౌలింగ్ చేయాల్సింది

ఆటలో తర్వాత తేమ ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆ సమయంలో బంతి చక్కగా బ్యాట్‌ మీదకు వస్తుందన్నారు. మా బ్యాటింగ్‌ లైన్‌ చాలా డెప్త్‌గానే ఉంది. మేము మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ మా ఐన్‌స్టీన్‌ పిచ్‌ గురించి తెలుసుకోకుండానే మొదట బ్యాటింగ్‌ చేయడం నిర్ణయించాడని షోయబ్‌ అక్తర్‌ అన్నారు. అయితే మ్యాచ్‌ తర్వాత పాకిస్థాన్‌ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి తిరస్కరించడం వివాదంగా మారింది. దీనిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్‌ చేసింది. లేకపోతే టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించింది.

Details

అధికారికంగా స్పందించని ఐసీసీ

ఈ అంశంపై సూర్యకుమార్‌ యాదవ్‌ సమర్థన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడమే వారి ఉద్దేశం అని తెలిపారు. పీసీబీ ఫిర్యాదును ఆసియా క్రికెట్‌ సంఘం (ఏసీసీ)కు అందించింది, అలాగే ఐసీసీ జోక్యం కోసం కోరుతోంది. పీసీబీ అధిపతి మొహ్‌సిన్‌ నఖ్వినే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉన్నారు. అయితే మ్యాచ్‌ రిఫరీని తొలగించాలని పీసీబీ చేసిన డిమాండ్‌పై ఐసీసీ అధికారికంగా స్పందించలేదని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్‌ సెప్టెంబర్‌ 17న యూఏఈతో జరగనున్న తదుపరి మ్యాచ్‌లో పాల్గనకుంటే, టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఈ పరిస్థితిలో యూఏఈ నాలుగు పాయింట్లతో భారత్‌తో సమానంగా నిలుస్తుంది.