ఇండియా శత్రుదేశం అంటూ విషం కక్కిన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్!
అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాకిస్థాన్ జట్టు భారత పర్యటకు వచ్చింది. ప్రత్యర్థి జట్టు అయినా భారత అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టులో వారికి లభించిన ఆదరణ,పార్క్ హయత్ హోటల్ సిబ్బంది వారి పట్ల చూపిన అతిథి మర్యాదాలు చూసి పాక్ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు పాక్ క్రికెటర్లు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. పాక్ ఆటగాళ్లు అతిథి మర్యాదల్లో ఏ లోటు లేకుండా చూసుకుంటున్న తరుణంలో ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ జకా ఆష్రఫ్ మాత్రం భారత్ పై విషం చిమ్మాడు. ఇండియాను శత్రుదేశంగా వర్ణిస్తూ పిచ్చి కూతలు కూశాడు.
జకా ఆష్రాన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న భారత్ అభిమానులు
శత్రుదేశంలో అయినా మరి ఏ ప్రాంతంలోనైనా టోర్నీ జరుగుతుంటే దేశం మొత్తం పాక్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలంటూ విషాన్ని నింపే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ జకా ఆష్రాన్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జకా ఆష్రాన్ వంటి వారు పాకిస్థాన్లో ఉండడం వల్లే అంతర్జాతీయంగా ఆ దేశానికి ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.