Page Loader
Pant- LSG: పంత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించడం ఖాయం : సంజీవ్ గొయెంకా
పంత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించడం ఖాయం : సంజీవ్ గొయెంకా

Pant- LSG: పంత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించడం ఖాయం : సంజీవ్ గొయెంకా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్‌జెయింట్స్‌ కు కొత్త కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ నియమితులయ్యారు. మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేశారు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరతో పంత్‌ను తమ జట్టులోకి తీసుకున్న లక్నో, అతడికే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సోమవారం కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా వెల్లడించారు. అనంతరం గొయెంకా మాట్లాడుతూ పంత్‌ 14-15 సంవత్సరాల పాటు ఎల్‌ఎస్‌జీ తరఫున ఆడతాడని, ఈ కాలంలో కనీసం ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు సాధిస్తాడని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అతను ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా మాత్రమే కాక, టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా మారతాడని తాను నమ్ముతున్నానని చెప్పారు.

Details

200శాతం కృషి చేస్తా

లక్నో తొలి టైటిల్‌ అందించేందుకు 200 శాతం కృషి చేస్తానని రిషబ్ పంత్ పేర్కొన్నారు. కొత్త జట్టు, కొత్త ఫ్రాంఛైజీ అయినా తన కెప్టెన్సీలో దృక్పథం మారదన్నారు. ఆటగాళ్లపై నమ్మకం ఉంటే ఊహించని ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. పంత్‌కు ఇది ఐపీఎల్‌లో రెండో సారి కెప్టెన్‌గా వ్యవహరించడం. 2016 నుంచి దిల్లీ క్యాపిటల్స్‌లో ఆడిన పంత్, 2021లో కెప్టెన్‌గా నియమితులయ్యాడు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్, 2024లో తిరిగి ఫీల్డ్‌లోకి వచ్చి దిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించాడు. 2023 సీజన్‌లో పంత్ లేకపోతే, శ్రేయస్‌ అయ్యర్‌ దిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.