NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ
    'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ

    Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు సాధించడంపై స్పందించారు.

    అమెరికా పర్యటనలో ఉన్న మోదీ, సీఈవోలు, అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నప్పటికీ, చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ స్వర్ణాలు గెల్వడంపై ఆనందం వ్యక్తం చేసారు.

    ''భారత క్రీడా రంగంలో ఇది ఒక సరికొత్త అధ్యాయం. ఇది భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. మరింతమంది చెస్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా మార్గం చూపుతుంది. విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు'' అని మోదీ పేర్కొన్నారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన ప్లేయర్లను అభినందించారు.

    వివరాలు 

    భారత చెస్‌లో ఇదొక అద్భుతం: చంద్రబాబు 

    ''ఇది భారత చదరంగంలో ఒక చారిత్రాత్మక విజయం.చెస్‌ ఒలింపియాడ్‌ 2024లో రెండు స్వర్ణ పతకాలు గెలిచి దేశాన్నిగర్వపడేలా చేశారు.ఈగెలుపులో మన తెలుగు ఛాంపియన్లు,ద్రోణవల్లి హారిక, పెండ్యాల హరికృష్ణ,ఉండటం ఎంతో గర్వకారణం''అని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    45వ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్లు రెండుస్వర్ణ పతకాలను సాధించాయి.ఉత్కంఠభరిత పోటీలతో భారత పురుషుల జట్టు ఓపెన్ విభాగంలో 21 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెలిచింది.

    11వ రౌండ్‌లో స్లోవేనియాను 3.5-0.5తేడాతో ఓడించడంతో ఈ విజయం సాధ్యమైంది.అదే విధంగా మహిళల జట్టు కూడా అజర్‌బైజాన్‌ను 3.5-0.5 తేడాతో ఓడించింది.

    10 రౌండ్ల తర్వాత భారత్‌ 19పాయింట్లతో, చైనా 17పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. చివరి రౌండ్‌లో టై అయినా,భారత్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    Mamata Banerjee: కోల్‌కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్  మమతా బెనర్జీ
    Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన మమతా బెనర్జీ
    Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై  ప్రధాని, అమిత్‌షా ఆరా  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025