Page Loader
ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కొత్త స్టార్
పంజాబ్ తరుపున మొదటి మ్యాచ్ ఆడుతున్న సికిందర్ రాజా

ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కొత్త స్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 01, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో భాగంగా రెండో మ్యాచ్ మొహాలీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మైదానంలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తమ హోమ్ పిచ్‌పై బ్యాటింగుకు దిగిన పంబాజ్ తడబడింది. ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి రెండో ఓవర్లలోనే పెవిలియానికి చేరాడు. ఇందులో రెండు భారీ సిక్సలు, రెండు ఫోర్లు ఉన్నాయి. అనంతరం క్రీజులోకి దిగిన రాజపక్స్, కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి.

సికిందర్ రజా

ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న సికిందర్ రజా

అనంతరం రాజపక్స్.. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయు ఔట్ అయ్యాడు. ఈ ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్ సికందర్ రాజా ఆడిన తొలి బంతికే ఫోర్ కొట్టి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో సికిందర్ రాజా అకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఏడాది 500 పరుగులు పైగా, 25 వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడిగా సికిందర్ రాజా నిలిచాడు. మొత్తంగా 24 మ్యాచ్‌లల్లో 23 ఇన్నింగ్‌లను ఆడిన రజా 35 సగటుతో 735 పరుగులు చేయడం విశేషం.