IPL 2024: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్ బారిన పడ్డ రెండో కెప్టెన్ గా రిషబ్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ షాక్ తగిలింది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఢిల్లీ చేసిన తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఇకపోతే, ఈ ఐపీఎల్ సీజన్ లో ఫైన్ బారిన పడ్డ రెండో కెప్టెన్ రిషబ్ పంత్. ఇంతకుముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు జరిమానా విధించారు. ఈ సీజన్ లో రెండు వరుస పరాజయాల తరువాత రిషబ్ పంత్ సేన తోలి విక్టరీ సాధించింది.