డబ్య్లూటీసీ ఫైనల్పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగోసారి టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. న్యూజిలాండ్పై శ్రీలంక ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.
వెంటనే ఐపీఎల్, తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఆటగాళ్లపై వర్క్ లోడ్ పడనుంది. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
ఆటగాళ్ల భారం పడకుండా ఉండేందుకు ఐపీఎల్ 2023 జరుగుతున్నప్పుడే డబ్ల్యూటీసీ సన్నాహాల్లో భాగంగా కొంతమందిని ముందే యూకేకు పంపిస్తామని శర్మ చెప్పారు.
రోహిత్ శర్మ
ఆటగాళ్లతో నిరంతరం టచ్లో ఉంటాం
తాము డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోయే ఆటగాళ్లందరితోనూ నిరంతరం టచ్లో ఉంటామని, వారి వార్క్ లోడ్ ను పర్యవేక్షిస్తామని, మే 21 నాటికి లీగ్ మ్యాచ్ లు ముగిస్తాయని హిట్ మ్యాన్ చెప్పారు.
ఐపీఎల్ ప్లే ఆఫ్ నుంచి ఆరు జట్లు తప్పుకుంటాయని, అందులో ఎవరెవరు ఉంటారో వారిని వీలైంతన త్వరగా యూకేకు పంపిస్తామని, వీలైనంత వరకు కొంతసమయం వారిని పర్యవేక్షిస్తామని, డబ్ల్యూటీసీలో జట్టు ఎంపిక తమకు పెద్ద సమస్యని అనుకోవట్లేదని రోహిత్ శర్మ వెల్లడించారు.
జూన్ 9న యూకే ఓవల్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.