NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ 
    వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ

    Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు.

    ఐపీఎల్ చరిత్రలో వాంఖడే స్టేడియంలో 100సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా ఆయన రికార్డు నెలకొల్పాడు.

    ఈ ఘనతను రోహిత్ శర్మ గురువారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు.

    163పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ కేవలం 16బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు బాది 26పరుగులు సాధించాడు.

    అతని స్ట్రైక్‌రేట్ 162.50గా ఉంది.ఇదే సందర్భంగా వాంఖడే స్టేడియంలో ఐపీఎల్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రోహిత్ చరిత్రలో నిలిచాడు.

    అంతేకాకుండా,ఐపీఎల్‌లో ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు కొట్టిన నాలుగో ఆటగాడిగా కూడా రోహిత్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

    వివరాలు 

    అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు

    ఐపీఎల్ చరిత్రలో ఒకే మైదానంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రాయల ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నాడు.

    అతడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 130 సిక్సర్లు బాదాడు. అతనికి తర్వాత వరుసగా క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లు ఉన్నారు.

    ఐపీఎల్‌లో ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు ఇలా ఉన్నారు:

    విరాట్ కోహ్లీ - చిన్నస్వామి స్టేడియంలో 130 సిక్సర్లు

    క్రిస్ గేల్ - చిన్నస్వామి స్టేడియంలో 127 సిక్సర్లు

    ఏబీ డివిలియర్స్ - చిన్నస్వామి స్టేడియంలో 118 సిక్సర్లు

    రోహిత్ శర్మ - వాంఖడే స్టేడియంలో 100 సిక్సర్లు

    కీరన్ పొలార్డ్ - వాంఖడే స్టేడియంలో 85 సిక్సర్లు

    వివరాలు 

     రెండు వికెట్లు తీసిన ముంబై బౌలర్  విల్ జాక్స్

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

    టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 బౌండరీలతో 40 పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశారు.

    ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీసి కీ ప్లేయర్‌గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

    వివరాలు 

    18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్

    ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

    బ్యాటింగ్‌లో ర్యాన్ రికెల్టన్ 23 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేయగా, విల్ జాక్స్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశారు.

    సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వాంఖ‌డే సిక్స‌ర్ల కింగ్‌..

    𝟮𝟱𝟬* Sixes for MI ✅
    𝟭𝟬𝟬* Sixes in #TATAIPL at Wankhede ✅

    𝐎𝐍𝐄 & 𝐎𝐍𝐋𝐘 𝐑𝐎𝐇𝐈𝐓 𝐒𝐇𝐀𝐑𝐌𝐀 🔥#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/xYhpdJNzD0

    — Mumbai Indians (@mipaltan) April 17, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    రోహిత్ శర్మ

    Rohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా సురేష్ రైనా
    Rohit Sharama: రోహిత్ శర్మ హుందాతనం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో) వాంఖేడ్ స్టేడియం
    Rohit Sharma: మళ్ళీ నిరాశపరిచిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 28 ర‌న్స్‌కే ఔట్‌ క్రీడలు
    ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక  ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025