LOADING...
Rohit Sharma: చరిత్ర అంచున రోహిత్ శర్మ.. నేటి మ్యాచ్‌తో కొత్త మైలురాయి?
చరిత్ర అంచున రోహిత్ శర్మ.. నేటి మ్యాచ్‌తో కొత్త మైలురాయి?

Rohit Sharma: చరిత్ర అంచున రోహిత్ శర్మ.. నేటి మ్యాచ్‌తో కొత్త మైలురాయి?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 13, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న తొలి వన్డేలో అరుదైన ఘనతకు అత్యంత చేరువలో ఉన్నారు. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ తప్పకుండా ఆడతారని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లను కలిపి ఓపెనర్‌గా 16 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న రెండో భారతీయ బ్యాటర్‌గా నిలుస్తారు. ఇప్పటివరకు ఈ ఘనతను భారత తరఫున సాధించిన ఏకైక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే. సెహ్వాగ్ తన కెరీర్‌లో ఓపెనర్‌గా 16,119 పరుగులు నమోదు చేయగా, రోహిత్ ప్రస్తుతం 15,994 పరుగులతో ఉన్నారు.

వివరాలు

126 పరుగులు చేస్తే మరో రికార్డు..

అంతేకాదు, తొలి వన్డేలోనే రోహిత్ 126 పరుగులు చేస్తే మరో విశేష రికార్డు ఆయన ఖాతాలో చేరనుంది. సెహ్వాగ్‌ను అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా అవతరిస్తారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆ ఘనత సాధించకపోయినా, సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఆయనకు ఉంది. ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ స్టార్ సనత్ జయసూర్య 19,298 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 18,744 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 16,950 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచారు.

వివరాలు

రికార్డుల వేటలో రోహిత్ శర్మ..

వెస్టిండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ 16,120 పరుగులతో ఐదో స్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మకు 16 వేల పరుగుల మైలురాయి చేరుకోవడానికి కేవలం 6 పరుగులే అవసరం. ఆ ఘనత సాధిస్తే ఆయన ఈ ప్రముఖ ఓపెనర్ల జాబితాలో చోటు దక్కించుకోవడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను అందుకునే దిశగా ముందడుగు వేస్తారు. విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు కొంత లోటుగా కనిపిస్తున్నప్పటికీ, రోహిత్ శర్మ పునరాగమనం, ఆయన రికార్డుల వేట అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దీంతో ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డేపై అందరి దృష్టి నెలకొంది.

Advertisement