Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్గా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ఫామ్లో ఉన్నాడు. భారత్కు అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు.
ధర్శశాల వేదికగా ఆదివారం న్యూజిలాండ్పై జరిగిన మ్యాచులోనూ సత్తా చాటాడు. 40 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో హిట్ మ్యాన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఒకే క్యాలెండర్ ఏడాదిలో 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి ఇండియన్ క్రికెటర్గా రోహిత్ చరిత్రకెక్కాడు.
అంతర్జాతీయంగా చూస్తే రోహిత్ కంటే ముందు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివీలియర్స్, వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ మాత్రమే ఉన్నారు.
Details
రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు : హిట్ మ్యాన్
గత రాత్రి న్యూజిలాండ్ మ్యాచులో హెన్రీ వేసి రెండో ఓవర్లో సిక్సర్ బాది రోహిత్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్ల కొట్టిన హీరోలు వీళ్లే..
1. ఏబీ డివీలియర్స్ - 58 (2015)
2. క్రిస్ గేల్ - 56 (2019)
3. రోహిత్ శర్మ - 53 (2023)
ఈ వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ మరో ఐదు సిక్సర్లు బాదితే ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు.
న్యూజిలాండ్ గెలిచిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నప్పుడు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), విరాట్ కోహ్లీ (Virat Kohli ) అద్భుతంగా ఆడారని కొనియాడారు.