Page Loader
ENG vs IND : భారత్‌తో రెండో టెస్టు.. స్టార్ పేసర్‌కు ఛాన్స్ ఇవ్వకుండా తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
భారత్‌తో రెండో టెస్టు.. స్టార్ పేసర్‌కు ఛాన్స్ ఇవ్వకుండా తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్

ENG vs IND : భారత్‌తో రెండో టెస్టు.. స్టార్ పేసర్‌కు ఛాన్స్ ఇవ్వకుండా తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. జూలై 3వ తేదీన, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌పై రెండు జట్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తొలి టెస్టులో ఓటమి చవిచూసిన భారత్‌ ఈసారి తప్పకుండా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలన్న సంకల్పంతో ఉంది. అదే సమయంలో తొలి టెస్టులో విజయాన్ని సాధించినా ఇంగ్లాండ్‌ అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తోంది.

Details

48 గంటల ముందే జట్టు ప్రకటన

మ్యాచ్‌కు 48 గంటల ముందు నుంచే ఇంగ్లాండ్‌ తమ తుది జట్టును ప్రకటించింది. గాయాల కారణంగా బాగా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ ఈ టెస్టు కోసం జట్టులోకి తిరిగి వచ్చినా, తుది జట్టులోకి ఎంపిక కాలేదు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకూడదని భావించిన ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్‌ అతడిని పక్కన పెట్టింది. దీంతో తొలి టెస్టులో ఆడిన అదే జట్టుతో రెండో మ్యాచ్‌కు బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా జోఫ్రా ఆర్చర్ సోమవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన శిక్షణా సెషన్‌కు హాజరుకాలేదు. అయితే మంగళవారం జట్టుతో కలవనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

Details

ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ ఇలా చూస్తే, సిరీస్‌ను సమం చేయాలన్న ఉత్సాహంతో భారత్‌, ఆధిక్యత కొనసాగించాలన్న ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో బరిలోకి దిగుతున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఈ పోరు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.