NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ వ‌న్డే మ‌హిళా క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు
    తదుపరి వార్తా కథనం
    Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ వ‌న్డే మ‌హిళా క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు

    Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ వ‌న్డే మ‌హిళా క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 27, 2025
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది.

    2024లో స్మృతి వన్డే క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో మెరవడంతో ఈ గుర్తింపు దక్కింది.

    గత ఏడాది ఆమె రన్‌మెషీన్‌గా మారి కేవలం 13వన్డే మ్యాచ్‌లలోనే 747పరుగులు సాధించింది.

    భారత జట్టు విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ 3-0తేడాతో గెలవడంలో స్మృతి కీలకంగా నిలిచింది.

    అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి వన్డేలో సెంచరీ చేసి మెరిపించింది.

    అలాగే,డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీతో తన క్రీడా నైపుణ్యాన్ని చాటింది.

    మహిళా వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి మందానా కొత్త స్టాండ‌ర్డ్‌ను నెల‌కొల్పింది.

    వివరాలు 

     95.15 స్ట్రయిక్ రేట్‌

    ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అవతరించింది.

    2024లో ఆమె 13 మ్యాచుల్లో 747 పరుగులు చేయడంతో మహిళల వన్డేల్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచింది.

    లౌరా వోల్వార్డ్ 697పరుగులతో,టమ్మీ బీమౌంట్ 554పరుగులతో,హేలే మాథ్యూస్ 469పరుగులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    స్మృతి మందానా 57.86 సగటుతో బ్యాటింగ్ చేసి, 95.15 స్ట్రయిక్ రేట్‌ను నమోదు చేసింది.

    దూకుడు ఆటతీరుతో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందింది.

    గత ఏడాది స్మృతి నాలుగు వన్డే సెంచరీలు సాధించి మహిళల క్రికెట్‌లో కొత్త రికార్డు సృష్టించింది.

    2024లో వన్డే మ్యాచ్‌లలో 100కిపైగా బౌండరీలు బాదింది. వీటిలో 95 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఐసీసీ చేసిన ట్వీట్ 

    For the second time, one of the leading stars of the game takes out the ICC Women’s ODI Cricketer of the Year award 🌟 pic.twitter.com/LJbgA8OobX

    — ICC (@ICC) January 27, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మృతి మంధాన

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    స్మృతి మంధాన

    Smriti Mandhana: స్మృతి మంధాన ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?.. నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. క్రీడలు
    Smriti Mandhana : స్మృతి మంధానా వరల్డ్ రికార్డు.. ఏకైక మహిళా క్రికెటర్‌గా ఘనత క్రీడలు
    ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-3లోకి మంధాన! క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025