
Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగేకు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్ బ్యాటర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో పాల్గొంటున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. అతని తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు.ఈ వార్త అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో శ్రీలంక మేనేజ్మెంట్కు తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్కు విషయం చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే దునిత్ మైదానంలో బోరున విలపించాడు. తర్వాత శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య ఆయనకు మైదానంలోనే తల్లిదండ్రుల మరణవార్త చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాలు
మ్యాచ్లో ఎదురైన కష్టం
తండ్రి మరణవార్త తెలియకముందే, దునిత్ శ్రీలంక-అఫ్గానిస్థాన్ మ్యాచ్లో ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అఫ్గాన్ బ్యాటర్ మహమ్మద్ నబీ అతని బౌలింగ్లో ఐదు సిక్స్లు వరుసగా బాదాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ దునిత్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు బాదడం, అఫ్గాన్కు అనూహ్యమైన స్కోరు సాధించడంలో సహాయపడింది. 20 ఓవర్లలో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అయితే, లక్ష్యాన్ని శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కుశాల్ మెండిస్ (74) హాఫ్ సెంచరీ చేసి, కుశాల్ పెరీరా (28) కమిందు మెండిస్ (26 నాటౌట్) ముఖ్యంగా రాణించారు.
వివరాలు
మ్యాచ్ తర్వాత దునిత్కి తెలిసిన నిజం
మ్యాచ్ ముగిసిన అనంతరం హోటల్ రూమ్కు వెళ్లే క్రమంలో, ఒక రిపోర్టర్ దునిత్ తండ్రి చనిపోయారని మహమ్మద్ నబీకి చెప్పాడు. ఈ వార్త తెలిసిన నబీ షాక్కు గురయ్యాడు. ఆ తర్వాత తన సంతాపాన్ని వ్యక్తపరిచాడు. "హార్ట్ ఎటాక్తో చనిపోయాడా?.. నిజంగా?" అంటూ నబీ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలంక తరఫున దునిత్ ఒక టెస్ట్, 31 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 46 వికెట్లు పడగొట్టాడు. అతని క్రీడా ప్రావీణ్యం, పర్ఫామెన్స్ను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నబీ షాకింగ్ రియాక్షన్
The moment reporters told Mohammad Nabi about passing away of Dinuth Wellalage Father due to heart attack.
— Rajiv (@Rajiv1841) September 18, 2025
Reporter told him that it happened during mid break of the match & sri lankan team told wellalage after the game.pic.twitter.com/OQT30OqvSE