NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..
    తదుపరి వార్తా కథనం
    Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..
    టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..

    Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 05, 2024
    01:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఉర్విల్ పటేల్ అత్యంత తక్కువ బంతుల్లో వరుసగా సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

    తాజాగా బరోడా జట్టు టీ20ల్లోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్రలో నిలిచింది.

    ఇప్పటివరకు ఈ రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. గాంబియాపై 2023 అక్టోబర్‌లో 344/4 స్కోరు చేసి జింబాబ్వే ఈ ఘనత సాధించింది.

    అయితే ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి బరోడా ఐదు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసి ప్రపంచ టీ20 క్రికెట్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది.

    వివరాలు 

    సిక్కింకు భారీ పరాజయం 

    సిక్కింకు వ్యతిరేకంగా జరిగిన ఈ మ్యాచ్‌లో,తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా 349/5 పరుగులు చేసింది.

    భాను పానియా(నాటౌట్ 134; 51 బంతుల్లో 5 ఫోర్లు, 15 సిక్సర్లు),శివాలిక్ శర్మ (55; 17 బంతుల్లో), అభిమన్యు సింగ్ (53; 17 బంతుల్లో),సోలాంకి (50; 16 బంతుల్లో),షష్వాత్ రావత్ (43; 16 బంతుల్లో) అదిరిపోయే ఆటతీరు కనబరిచారు.

    వీరు బంతులను ఎడాపెడా బాదుతూ పరుగుల వరద పారించారు.ఆపై భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సిక్కిం జట్టు పూర్తి విఫలమైంది.

    నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 86 పరుగులే చేయగలిగింది.

    ఈ కారణంగా బరోడా 263 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

    వివరాలు 

    అరుదైన ఘనత 

    ఈ మ్యాచ్‌లో భారత స్టార్ హార్దిక్ పాండ్య ఆడకపోవడం గమనార్హం, ఆయన స్థానంలో కృనాల్ పాండ్య జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.

    టీ20 క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అత్యధిక వ్యత్యాసంతో గెలిచిన నాలుగో జట్టుగా బరోడా నిలిచింది.

    మొదటి స్థానంలో జింబాబ్వే 290 పరుగుల తేడాతో గాంబియాను ఓడించగా, నేపాల్ 273 పరుగులతో మంగోలియాపై, నైజీరియా 264 పరుగులతో ఐవరీ కోస్ట్‌పై ఈ ఘనత సాధించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Shaktimaan: 'శక్తిమాన్‌' మరోసారి వస్తున్నాడు.. ఆడియో సిరీస్‌గా వచ్చేస్తున్న సూపర్‌హీరో! సినిమా
    Ranyarao: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. హోం మంత్రి పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు  కర్ణాటక
    HariHara veeramallu: సలసల మరిగే రక్తమే.. పవన్ కళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' నుంచి పాట విడుదల!  హరిహర వీరమల్లు
    National Herald case: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    క్రికెట్

    IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. యువ పేసర్‌కు అవకాశం టీమిండియా
    Amaravati: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్‌దేవ్‌.. గోల్ఫ్ అభివృద్ధిపై చర్యలు  కపిల్ దేవ్
    BenStokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం  ఇంగ్లండ్
    Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఆస్తుల నుంచి ప్రేమకథ వరకు..! జస్పిత్ బుమ్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025