Trisha Gongidi: ఫైనల్లో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్
ఈ వార్తాకథనం ఏంటి
2024 టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ గెలిచి ఛాంపియన్గా నిలిచింది.
ఇప్పుడు 7 నెలల తర్వాత, ఈ రెండు జట్లు అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో మరో ఫైనల్ మ్యాచ్కు సిద్దమయ్యాయి.
ఈ ఫైనల్లో భారత్ ఫేవరిట్గా నిలిచింది. ఇందులో భారత స్టార్ ఓపెనర్ త్రిష గోంగిడి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం, త్రిష గోంగిడి ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్లో ఉంది.
ఆమె ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్లలో 66.25 సగటుతో 149 స్ట్రైక్ రేట్తో 265 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ కూడా చేసింది.
Details
అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా త్రిష
2025 అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
ఆమె తర్వాత ఇంగ్లాండ్కు చెందిన డెవినా పెర్రిన్ 176 పరుగులతో ఉన్నారు. దీంతో త్రిష గోంగిడి ఈ రికార్డుతో టోర్నమెంట్ను ముగించాలని ఆశిస్తున్నారు.
త్రిష గోంగిడి 2023 అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా తన పేరిట చేయాలని చూస్తోంది.
ఈ రికార్డును భారత బ్యాట్స్మన్ శ్వేతా సెహ్రావత్ తన పేరిట సృష్టించారు. శ్వేత 2023లో 99 సగటు, 139 స్ట్రైక్ రేట్తో 297 పరుగులు చేసింది. అయితే త్రిష గోంగిడి 33 పరుగులు సాధిస్తే, ఈ రికార్డు సరసన ఆమె నిలవనుంది.
Details
బౌలింగ్ విభాగంలో రాణిస్తున్న వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా
అంతేకాదు, భారత్ మరో ఓపెనర్ జి కమలిని కూడా ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేయగలిగింది.
ఆమె 6 మ్యాచ్లలో 45 సగటుతో 135 పరుగులు సాధించింది. బౌలింగ్ విభాగంలో, వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
వైష్ణవి శర్మ ఇప్పటివరకు 15 వికెట్లు తీసి ఒక ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సృష్టించింది. ఆమె తర్వాత ఆయుషి శుక్లా 12 వికెట్లతో రెండవ స్థానంలో ఉంది.
ఈ ఫైనల్లో త్రిష, కమలిని, వైష్ణవి, ఆయుషి అద్భుత ప్రదర్శన చూపించి మరో ప్రపంచ కప్ ట్రోఫీని తీసుకురావాలని అభిమానులు అశిస్తున్నారు.