Page Loader
పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు
భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ, పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో పరుగుల రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ-20 మ్యాచుల్లో మొదటి ఐదు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్ గా వర్మ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో ఫ్లోరిడా వేదికగా జరిగిన ఐదో టీ-20 మ్యాచ్‌లో తిలక్‌ 27 పరుగులు చేశాడు. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల్లో కలిపి 173 పరుగులు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు మరో భారత ఆటగాడు దీపక్‌ హుడా (172) పరుగులను వర్మ అధిగమించడం విశేషం. ఈ జాబితాలో ఇప్పటికే స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ (179) పరుగులతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.

DETAILS

173 రన్స్ చేసిన వర్మ, రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు

20 ఏళ్ల తిలక్ వర్మ, విండీస్‌ తో జరిగిన టీ-20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. కరేబియన్ గడ్డపై వర్మ మంచి ప్రదర్శనే కనబరిచి రికార్డులను లిఖించుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడిన వర్మ 173 పరుగులు నమోదు చేశాడు. మరోవైపు వెస్టిండీస్ చేతిలో కరేబియన్ గడ్డపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.ఈ మేరకు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో విండీస్ వశమైంది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ-20 సిరీస్‌లో విండీస్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలవడం ఇదే ఫస్ట్ టైమ్. తదుపరి భారత్‌ ఐర్లాండ్‌లో పర్యటించనుంది. అతిథ్య ఐరీష్‌తో 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ ఆడనుంది. డబ్లిన్‌ వేదికగా ఆగస్ట్ 18న తొలి టీ-20 జరగనుంది.