
Shane Watson: 'ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదే'.. షేన్ వాట్సన్ వ్యాఖ్యలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) టైటిల్ గెలుచుకుంటుందన్న నమ్మకాన్ని ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ వ్యక్తం చేశారు.
ఫైనల్లో ఆర్సీబీ కప్ అందుకుంటుందని మాత్రమే కాదు, ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవుతాడని జోష్యం కూడా చెప్పారు.
లీగ్ దశ ముగిసే సమయానికి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 4 ఓటములు నమోదు చేయగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
Details
లక్నో జరిగిన మ్యాచులో భారీ లక్ష్యాన్నీ చేధించిన ఆర్సీబీ
లీగ్ దశ చివరి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం నమోదు చేసిన ఆర్సీబీ జట్టు, దాంతో ఫామ్ను కొనసాగించింది.
మే 29న ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-1లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్పై తేడా స్పష్టంగా విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 14.1 ఓవర్లలోనే 101 పరుగులకే ఆలౌట్ కాగా, లక్ష్యాన్ని బెంగళూరు 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
Details
తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్ లో అడుగుపెట్టిన ఆర్సీబీ
దీంతో 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది ఆర్సీబీ. ఇది ఆ జట్టుకు నాలుగో ఫైనల్. 2009, 2011, 2016లో ఫైనల్ చేరినా టైటిల్ చేజార్చుకుంది.
ఈ మ్యాచ్కు ముందే షేన్ వాట్సన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. "ఈ సారి ఖచ్చితంగా టైటిల్ ఆర్సీబీదే. కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడు.
హేజిల్వుడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇవన్నీ చూస్తే ఫైనల్లో ఆర్సీబీనే విజేతగా నిలుస్తుందని నా నమ్మకమని వాట్సన్ వ్యాఖ్యానించారు.