LOADING...
IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌లో ట్రేడ్ కలకలం.. ఆరుగురు ఆటగాళ్లకు బైబై..?
రాజస్థాన్ రాయల్స్‌లో ట్రేడ్ కలకలం.. ఆరుగురు ఆటగాళ్లకు బైబై..?

IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌లో ట్రేడ్ కలకలం.. ఆరుగురు ఆటగాళ్లకు బైబై..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు తమ దృష్టిని ఐపీఎల్ 2026 సీజన్‌పై నిలిపాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ (RR) కీలకమైన మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఆరుగురు ఆటగాళ్లకు ఇతర జట్ల నుంచి ట్రేడ్ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో కెప్టెన్ సంజూ శాంసన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Details

ట్రేడింగ్ విండో ప్రారంభం

2026 సీజన్ కోసం ట్రేడింగ్ విండో IPL 2025 ఫైనల్‌ తర్వాత రోజైన జూన్ 4న తెరుచుకుంది. ఈ విండో వేలానికి ఒక వారం ముందు వరకు కొనసాగుతుంది. జట్లు తమ స్క్వాడ్‌లను పటిష్టం చేసుకునేందుకు ఇదొక కీలక దశ. రాజస్థాన్ వర్గాల ప్రకారం, ఆరుగురు ఆటగాళ్లకు వివిధ జట్ల నుంచి ఆఫర్లు వచ్చాయి. మేము కూడా ఇతర జట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. అన్ని జట్లు తమ టీమ్‌ను స్ట్రాంగ్‌ చేయాలనుకుంటున్నాయి. మేమూ అంతే.

Details

శాంసన్‌పై ట్రేడ్ టాక్

సంజూ శాంసన్, 2013 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ముఖ్య ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా కూడా సేవలందిస్తున్న శాంసన్, 2025 సీజన్‌లో వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన ఇచ్చినా.. జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం నిరాశను మిగిల్చింది. అందులోనే ట్రేడ్ వార్తలు ఊపందుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి జట్లు శాంసన్‌ను తమ టీమ్‌లోకి తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది. ధోనీ తర్వాత కెప్టెన్ ఎంపిక కోసం చూస్తున్న CSKకి శాంసన్ బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నారు. కోల్‌కతా కూడా తమ వికెట్ కీపింగ్ విషయంలో మార్పులను అన్వేషిస్తోంది.

Advertisement

Details

ధృవ్ జురెల్ ప్రభావం

శాంసన్‌కు ప్రత్యామ్నాయంగా ధృవ్ జురెల్ రూపంలో రాజస్థాన్ వద్ద బలమైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఉంది. దీంతో శాంసన్‌ను ట్రేడ్ చేయడంపై ఫ్రాంచైజీ ఓపెన్‌గా ఆలోచిస్తున్నదనే అభిప్రాయం నెలకొంది. ఇతర మార్పులు, కెప్టెన్సీ చర్చలు శాంసన్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లకూ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో శాంసన్ గాయపడినప్పుడు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గువాహటి రాజస్థాన్‌కు రెండవ హోమ్ గ్రౌండ్‌గా మారడంతో, పరాగ్‌ను ఫ్యూచర్ కెప్టెన్‌గా పరిగణిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్‌ను పక్కన పెట్టి పరాగ్‌కి అవకాశం ఇవ్వడాన్ని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Details

చివరికి

ట్రేడింగ్ విండోలో రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. శాంసన్ భవిష్యత్తు, ఇతర ఆటగాళ్ల రవాణా, కొత్త కెప్టెన్సీ ఎంపిక ఇవన్నీ ఆ జట్టు ఆకృతిపై పెద్దగా ప్రభావం చూపనున్నాయి. IPL 2026 ముందు ఎలాంటి సంచలన మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement