TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీ శుభవార్త.. ఉప్పల్ స్టేడియంకి 60 ప్రత్యేక బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పోటెత్తనున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) వారికీ శుభవార్త చెప్పింది.
ఈ రోజు హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
సజ్జనార్
క్రికెట్ అభిమానులకు సజ్జనార్ విజ్ఞప్తి
'క్రికెట్ అభిమానులకు శుభవార్త! ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు జరిగే సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు 60 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. మ్యాచ్ని వీక్షించేందుకు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించాల్సిందిగా క్రికెట్ అభిమానులను TSRTC అభ్యర్థిస్తోంది" అని టీఎస్ఆర్టీసీ ఎండీ VC సజ్జనార్ ఎక్స్లో పోస్ట్లో తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సజ్జనార్ చేసిన ట్వీట్
క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024