NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు
    బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు

    BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది ముగింపు నాటికి ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

    భారత సీనియర్‌ పురుషుల జట్టు వెస్టిండ్స్‌, దక్షిణాఫ్రికాతో తలపడే టెస్టు మ్యాచ్‌లకు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

    అదే విధంగా, భారత సీనియర్‌ మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్‌ వేదికలు,దక్షిణాఫ్రికా-ఏ జట్టు భారత్‌-ఏ జట్టుతో ఆడే వన్డేలకు సంబంధించి వేదికలు కూడా మారా​యి.

    మార్పులను బీసీసీఐ జూన్‌ 9న అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 10 నుండి 14 వరకు జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగాల్సి ఉండగా,ఇప్పుడు ఆ మ్యాచ్‌ న్యూఢిల్లీకి చెందిన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనుంది.

    వేదిక మారినప్పటికీ,మ్యాచ్‌ తేదీలు యథాతథంగా కొనసాగనున్నాయి.

    వివరాలు 

    ఢిల్లీలో నవంబర్‌లో తీవ్ర వాయు కాలుష్యం

    నవంబర్‌ 14 నుంచి 18 వరకు జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ముందుగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉండగా,ఇప్పుడు అదే మ్యాచ్‌ కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.

    వేదిక మార్పుకు కారణంగా,ఢిల్లీలో నవంబర్‌లో తీవ్ర వాయు కాలుష్యం ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

    భారత మహిళల జట్టు సెప్టెంబర్‌ 14, 17, 20 తేదీల్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ స్టేడియంలో ఔట్‌ఫీల్డ్‌, పిచ్‌కు మరమ్మతులు జరుగుతున్న కారణంగా మొదటి రెండు వన్డేలను పంజాబ్‌లోని న్యూ ఛండీఘడ్‌లో ఉన్న పీసీఏ స్టేడియానికి మార్చారు.

    వివరాలు 

    మూడో వన్డే న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో..

    ఇక మూడో వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

    ఇక సౌతాఫ్రికా-ఏ జట్టు నవంబర్‌ 13, 16, 19 తేదీల్లో భారత్‌-ఏ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉండగా, ఈ మ్యాచ్‌ల వేదికను రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మార్చినట్లు బీసీసీఐ తెలిపింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీసీసీఐ చేసిన ట్వీట్ 

    🚨 NEWS 🚨

    BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.

    Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA

    — BCCI (@BCCI) June 9, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు బీసీసీఐ
    Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ తెలంగాణ
    Jyoti Malhotra: హర్యానా కోర్టులో జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చిన కోర్టు.. జ్యోతి మల్హోత్రా
    Deadly Bioweapon: చైనాలోనే,మరో భయంకరమైన ఫంగస్‌.. హెచ్చరించిన చైనా నిపుణుడు గోర్డాన్‌ చాంగ్‌  చైనా

    బీసీసీఐ

    BCCI -Team India: కుటుంబసభ్యుల విషయంలో క్రికెటర్లకు ఊరట.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..! క్రీడలు
    IPL 2025: ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్లతో మీటింగ్ ఫిక్స్ చేసిన BCCI...   క్రీడలు
    BCCI: బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులేమీ లేవు.. కార్యదర్శి సైకియా స్పష్టీకరణ క్రికెట్
    Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే  మూడు రెట్లు!  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025