Vinesh Phogat Retirement: నా పై రెజ్లింగ్ గెలిచింది ..నేను ఓడిపోయా: రెజ్లింగ్కు వినేశ్ ఫొగాట్ గుడ్బై
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్లో ఆమె 50 కిలోల విభాగంలో ఫైనల్స్కు చేరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ ఉదయం ఆమె బరువు 50 కిలోల నుంచి 100 గ్రాములు ఎక్కువగా ఉండడడంతో వినేష్ ఈవెంట్కే అనర్హురాలయ్యారు. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
వినేష్ తన తల్లికి క్షమాపణలు చెప్పారు
భారత్ తరఫున మూడు ఒలింపిక్స్లో పాల్గొన్న వినేష్ ఫోగట్ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె తన తల్లికి క్షమాపణలు చెప్పింది. X ఖాతాలో రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసింది. ''రెజ్లింగ్ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా'' అని పేర్కొంది.
వినేష్ ఫోగట్ చేసిన ట్వీట్
వినేష్ ఫోగట్ కెరీర్
1994లో జన్మించిన వినేష్ ఫోగట్ 7 ఏళ్ల వయసులో కుస్తీ పట్టడం ప్రారంభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆమె మొదటి స్థానానికి చేరుకుంది. వినేష్ 2019 నుండి 2022 ప్రపంచ ఛాంపియన్షిప్లలో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాలను గెలుచుకుంది. 2018 ఆసియా క్రీడల్లో వినేష్ స్వర్ణం సాధించింది. దీనితో పాటు, వినేష్ కామన్వెల్త్ గేమ్స్లో 3 బంగారు పతకాలు కూడా సాధించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ రెండింటిలోనూ స్వర్ణం సాధించిన భారతదేశం నుండి మొదటి రెజ్లర్ ఆమె.
ఒలింపిక్ ఫైనల్కు చేరుకున్న తొలి మహిళా రెజ్లర్
పారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె తన తొలి రౌండ్లో జపాన్కు చెందిన రెజ్లర్ యుయి సుసాకిని ఓడించింది. దీనికి ముందు, సుసాకి తన 82 మ్యాచ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏ మ్యాచ్లోనూ ఓడిపోలేదు. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళా రెజ్లర్ కూడా ఒలింపిక్స్లో ఫైనల్స్కు చేరుకోలేకపోయింది. అయితే, రెండో రోజు 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెపై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది.