Page Loader
T20 Format: టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025.. కానీ అభిమానులు మాత్రం వన్డే ఫార్మాట్‌ కోసం డిమాండ్ ! ఎందుకంటే..?
టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025.. కానీ అభిమానులు మాత్రం వన్డే ఫార్మాట్‌ కోసం డిమాండ్ ! ఎందుకంటే..?

T20 Format: టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025.. కానీ అభిమానులు మాత్రం వన్డే ఫార్మాట్‌ కోసం డిమాండ్ ! ఎందుకంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025ను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రసిద్ధ క్రీడా ప్రసార సంస్థ సోని స్పోర్ట్స్ ఇటీవల ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఓ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. సాధారణంగా ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించడం పరంపరగా వస్తోంది. అయితే గతంలో ఒకసారి మాత్రం టీ20 ఫార్మాట్‌లోనూ దీనిని నిర్వహించారు. ఈసారి కూడా ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లోనే జరపాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక ప్రధాన కారణం.. వచ్చే ఏడాది,అంటే 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్.దీనికీ భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి, అంత పెద్ద ఈవెంట్‌కు ముందు టీములు సన్నద్ధం కావాలంటే, ఆసియా కప్‌ను అదే ఫార్మాట్‌లో నిర్వహించడం ఉత్తమమని నిర్వాహకులు భావిస్తున్నారు.

వివరాలు 

ఈ సీనియర్ ఆటగాళ్ల ఆటను మళ్లీ చూడాలంటే..

దీంతో టీ20 ఫార్మాట్‌కు ఆటగాళ్లు మరింతగా అలవాటు పడతారని,వరల్డ్‌కప్‌ ముందు మంచి ప్రాక్టీస్‌గా ఇది ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. కానీ ఈనిర్ణయంపై టీమిండియా అభిమానుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. వన్డే ఫార్మాట్‌లోనే ఆసియా కప్‌ జరగాలని వారు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. వారి అభ్యర్థనకు ఒక బలమైన కారణం కూడా ఉంది.అదేంటంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల లాంటి సీనియర్ ఆటగాళ్ల ఆటను మళ్లీ చూడాలంటే వన్డే ఫార్మాట్‌ ఒక్కటే దారి. ఎందుకంటే,ఈ ఇద్దరూ ఇటీవల జరిగిన టీ20వరల్డ్‌కప్ 2024లో విజయం సాధించిన తరువాత తాము ఇకపై పొట్టి ఫార్మాట్‌లో ఆడబోమని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు,కొద్ది వారాల క్రితమే టెస్టు ఫార్మాట్ నుంచీ కూడా వీరిద్దరూ వైదొలిగారు.

వివరాలు 

రోహిత్-కోహ్లీ ఆటను ఆస్వాదించాలంటే.. 

ఈ పరిస్థితుల్లో వీరిద్దరిని మళ్లీ టీమిండియా జెర్సీలో చూడాలంటే వన్డే మ్యాచ్‌లే అవకాశం. అందుకే, రోహిత్-కోహ్లీ ఆటను ఆస్వాదించాలంటే ఆసియా కప్‌ను టీ20 కంటే వన్డే ఫార్మాట్‌లో నిర్వహించాలని అభిమానులు కోరుతున్నారు. అలా జరిగితే ఈ దిగ్గజులను మళ్లీ ఎక్కువగా చూసే అవకాశం దక్కుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు.